iDreamPost

Anchor Anasuya: కుర్రాళ్ల గుండెల్లో చిచ్చురేపిన అనసూయ.. బికినీ 2.O పిక్స్ వైరల్..

  • Author Soma Sekhar Published - 06:29 PM, Fri - 16 June 23
  • Author Soma Sekhar Published - 06:29 PM, Fri - 16 June 23
Anchor Anasuya: కుర్రాళ్ల గుండెల్లో చిచ్చురేపిన అనసూయ.. బికినీ 2.O పిక్స్ వైరల్..

అనసూయ.. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన అందాల తార. యాంకర్ గా తన కెరీర్ ను ప్రాంభించిన ఈ భామ.. తన అందచందాలతో యువకుల మనసులను కొల్లగొట్టింది. ఇక ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెకేషన్ కు వెళ్లినా గానీ అక్కడి పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు హాట్ నెస్ పెంచింది. ఇటీవలే తన భర్తతో కలిసి దిగిన రొమాంటిక్ పిక్స్ ను షేర్ చేసి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. తాజాగా బికినీ పిక్స్ ను షేర్ చేసి కుర్రాళ్ల గుండెల్లో చిచ్చురేపింది.

సెలబ్రిటీలు ఏ ప్రాంతానికి ట్రిప్ కు వెళ్లినా గానీ అక్కడి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఆ విషయంలో యాంకర్ అనసూయ కాస్తంత ఎక్కువే చదివారు. అందుకే తన వెకేషన్ పిక్స్ ను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. కొన్ని రోజుల క్రితం లైట్ బికినీ పిక్స్ వదిలిన అనసూయ.. తాజాగా బికినీ 2.O పిక్స్ ను షేర్ చేసింది. మెున్న బ్యాలెన్స్ ఉన్న ఫొటోలను తాజాగా పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ పిక్స్ లో వైట్ అండ్ వైట్ టూ పీస్ బికినీ వేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఇప్పటి వరకు అనసూయ హాట్ ఫొటోలనే తన ఇన్ స్టాలో షేర్ చేసిందే తప్ప.. బికినీ పిక్స్ ను ఎన్నడూ పోస్ట్ చేయలేదు. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్లిన రంగమ్మత్త సముద్ర తీరాన సాగర కన్యలా మెరిసిపోయింది. ఈ ఫొటోలకు క్యాఫ్షన్ కూడా జతచేసింది. ప్రకృతి ఒడిలో సేదతీరే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం అని, వాటి భద్రంగా ఫొటోల రూపంలో దాచుకుంటాం అని, ట్రిప్ లో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయం అని రాసుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన బికినీ పిక్స్ నెట్టింట సెగలు రేపుతున్నాయి.

ఇక ఫొటోలపై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు నచ్చిన డ్రెస్ ఆమె వేసుకుంది అని కొందరు అంటే.. నీ అందం నీ వ్యక్తిగతం అందరికి చూపించాల్సిన పనిలేదు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది బికినీ 2.O రచ్చ అని మరికొందరు రాసుకొచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ మానేసిన తర్వాత.. వరుసగా సినిమాలతో పుల్ బిజీగా ఉంది రంగమ్మత్త. అదీకాక ఈ ఫొటోలను ఇంత అందంగా తీసింది మై వెరీ టాలెంటెడ్ మ్యాన్ సుశాంక్ భరద్వాజ్ అంటూ రాసుకొచ్చింది అనసూయ.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి