iDreamPost

బన్నీ సెకండ్ మల్టీప్లెక్స్ ప్లానింగ్.. ఈసారి ఏకంగా ఆ ఏరియాలో..?

  • Author ajaykrishna Updated - 10:27 PM, Mon - 23 October 23

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. వేరే వేరే రంగాలలో రాణిస్తున్నప్పటికీ.. మల్టీప్లెక్స్ రంగం వైపు కూడా ఒక్కొక్కరుగా ఆసక్తి చూపుతున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి మాల్ తో సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్ లో ఐదు స్క్రీన్ లతో మల్టీప్లెక్స్ ప్రారంభించి సక్సెస్ అయ్యాడు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. వేరే వేరే రంగాలలో రాణిస్తున్నప్పటికీ.. మల్టీప్లెక్స్ రంగం వైపు కూడా ఒక్కొక్కరుగా ఆసక్తి చూపుతున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి మాల్ తో సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్ లో ఐదు స్క్రీన్ లతో మల్టీప్లెక్స్ ప్రారంభించి సక్సెస్ అయ్యాడు.

  • Author ajaykrishna Updated - 10:27 PM, Mon - 23 October 23
బన్నీ సెకండ్ మల్టీప్లెక్స్ ప్లానింగ్.. ఈసారి ఏకంగా ఆ ఏరియాలో..?

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. వేరే వేరే రంగాలలో రాణిస్తున్నప్పటికీ.. మల్టీప్లెక్స్ రంగం వైపు కూడా ఒక్కొక్కరుగా ఆసక్తి చూపుతున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి మాల్ తో సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్ లో ఐదు స్క్రీన్ లతో మల్టీప్లెక్స్ ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. ఈ ఇద్దరు హీరోలకు మల్టీప్లెక్స్ బిజినెస్ లో భాగస్వామ్యంగా ఉంది ఏషియన్ ఫిలిమ్స్. ఒకచోట సక్సెస్ అయ్యాక ఎవరైనా బిజినెస్ ని ఇంకా విస్తరించే ఆలోచన చేస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అలాంటి ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. హైదరాబాద్ లో ఏఎంబి మాల్ తర్వాత సెకండ్ మల్టీప్లెక్స్ రాష్ట్రం దాటి బెంగుళూరులో నిర్మిస్తున్నాడు. దానికి కూడా ఏషియన్ ఫిలిమ్స్ వారు భాగస్వామిగా ఉండనుంది. ఇదే బాటలో విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ఓ మల్టీప్లెక్స్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ రెండో మల్టీప్లెక్స్ ప్లానింగ్ లో ఉన్నాడట. ఈసారి ఎక్కడ ప్లాన్ చేస్తున్నాడో తెలుసా? హైదరాబాద్ లోనే రియల్ ఎస్టేట్ లో అత్యంత ఖరీదైన ఏరియాగా పేరొందిన కోకాపేటలో ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్లానింగ్ జరిగిందని.. కాకపోతే అధికారికంగా అనౌన్స్ చేయలేదని అంటున్నారు.

ఇక ఈ సెకండ్ మల్టీప్లెక్స్ ని అల్లు అర్జున్ ఒక్కడే సోలోగా రన్ చేస్తాడా లేక వేరే ఎవరితోనైనా భాగస్వామ్యం అవుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్ థియేటర్స్ ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తున్న విషయం విదితమే. సో.. బిగ్గెస్ట్ మూవీస్ పడితే.. పడ్డాక హిట్ టాక్ వస్తే మల్టీప్లెక్స్ లన్నీ జనాలతో కళకళలాడుతున్నాయి. సరైన రిలీజ్ లు లేకపోతే మాత్రం థియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకున్న హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో పుష్పకు కొనసాగింపుగా పుష్ప 2 చేస్తున్నాడు. మరి అల్లు అర్జున్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి