iDreamPost

ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. బస్సు టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్!

ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. బస్సు టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్!

టాటా గ్రూపుకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి 20 వరకు ఫ్లైట్ టికెట్ల బుకింగ్ పై స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఎయిర్ ఇండియా 96 హవర్ సేల్ పేరుతో ఈ ఆఫర్ ను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను ప్రవేశ పెట్టినట్లు ప్రకటనలో తెలిపింది. అసలు ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా ఎయిర్ ఇండియా 96 హవర్ సేల్ పేరుతో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. దేశీయ ప్రయాణానికి ఎకానమీ క్లాస్ టికెట్ ధర కేవలం రూ.1470 నుంచి ప్రారంభమవుతుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. కానీ, బిజినెస్ క్లాస్ ధరలు మాత్రం రూ.10,130 నుంచి ప్రారంభమవుతుందని కూడా తెలిపింది. మరో విషయం ఏంటంటే? ఈ ఆఫర్ ఆగస్టు 17 నుంచి ఆగస్టు 20 రాత్రి వరకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఎంపిక చేసిన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్ లలో మాత్రం సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

ఇది కూడా చదవండి: పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నిమిదిన్నర ఏళ్ల బాలుడు! అసలు స్టోరీ ఏంటంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి