iDreamPost

‘ఆదిపురుష్’ కాంట్రవర్సీపై స్పందించిన రైటర్ ముంతాషిర్.. క్షమించాలంటూ..!

  • Author singhj Published - 04:44 PM, Sat - 8 July 23
  • Author singhj Published - 04:44 PM, Sat - 8 July 23
‘ఆదిపురుష్’ కాంట్రవర్సీపై స్పందించిన రైటర్ ముంతాషిర్.. క్షమించాలంటూ..!

రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన ‘ఆదిపురుష్’ మూవీ రీసెంట్​గా విడుదలైన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే ఈ సినిమాకు మిక్స్​డ్ టాక్ వచ్చింది. ఇందులో హనుమంతుడి పాత్ర చెప్పే డైలాగ్స్​ఫై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. రావణాసురుడు, ఇంద్రజిత్తు క్యారెక్టర్ల గెటప్స్​తో పాటు లంకా నగరాన్ని చూపించిన విధానంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు గుప్పించారు. ‘ఆదిపురుష్​’ను తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్​ మీద నెట్టింట భారీగా ట్రోలింగ్ సాగింది. రౌత్​కు అసలు రామాయణం గురించి ఏమాత్రం అవగాహన లేదని చాలా మంది విమర్శించారు.

‘ఆదిపురుష్​’ సినిమాతో రామాయణాన్ని ఓం రౌత్ చెడగొట్టారని నెటిజన్స్ ట్రోల్ చేశారు. తనకు ఇష్టం వచ్చినట్లు సినిమా తీశారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ‘ఆదిపురుష్​’ రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా సారీ చెప్పారు. మూవీపై వచ్చిన కాంట్రవర్సీ మీద ఆయన స్పందించారు. ‘ఆదిపురుష్’ వల్ల జనాల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తమ వల్ల ఇబ్బంది పడిన వారందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెప్పారాయన. ఆ హనుమంతుడు మనందర్నీ కలసికట్టుగా, ఐక్యంగా ఉంచాలని.. మన దేశానికి సేవ చేసేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నానని ఇన్​స్టా వేదికగా చేసిన ఒక పోస్ట్​లో మనోజ్ ముంతాషిర్ రాసుకొచ్చారు.

‘ఆదిపురుష్​’ ఫిల్మ్ మీద తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో మనోజ్ ముంతాషిర్ ఇన్​స్టాలో పెట్టిన ఈ పోస్ట్ వైరల్​గా మారింది. మరోవైపు ‘ఆదిపురుష్’ మూవీకి అలహాబాద్ హైకోర్టు రీసెంట్​గా షాక్ ఇచ్చింది. జులై 27వ తేదీన దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్​తో పాటు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్​ను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ సినిమా ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అనే విషయాన్ని సమీక్షించి.. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి