iDreamPost

ఇండస్ట్రీలో చాలా మంది లెస్బియన్లుగానే జీవిస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 06:05 PM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Published - 06:05 PM, Mon - 2 October 23
ఇండస్ట్రీలో చాలా మంది లెస్బియన్లుగానే జీవిస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నటీ, నటులు చేసే కామెంట్స్ అప్పుడప్పుడు వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. ఇక మరికొందరి కామెంట్స్ మాత్రం షాక్ కు గురిచేస్తాయి. తాజాగా అలాంటి షాకింగ్ కామెంట్సే చేసేంది ఓ యంగ్ హీరోయిన్. ఓ రంగంలో ఉన్న చాలా మంది లెస్బియన్లుగానే జీవిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘వాజ్ వు తొడంగుమిడం నీతానే’ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరోయిన్స్ శృతి పెరియస్వామి, నిరంజన నతియార్ జోడీగా నటించారు. ఈ సినిమా ఈవెంట్ లోనే ఈ కామెంట్స్ చేసింది యంగ్ హీరోయిన్.

‘వాజ్ వు తొడంగుమిడం నీతానే’ జయరాజ్ పళని దర్శకత్వంలో షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థతో కలిసి నటి నీలిమా ఇసై ఈ చిత్రాన్ని నిర్మించింది. కోలీవుడ్ లో షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది. దీంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు హాజరైన మూవీ యూనిట్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇక ఈ చిత్రంలో శృతి పెరియస్వామి, నిరంజన నతియార్ జోడీ లెస్బియన్లుగా నటించారు. ఈ మూవీకి సంబంధించిన తమ అనుభావాలను యంగ్ హీరోయిన్స్ పంచుకున్నారు.

శృతి పెరియస్వామి మాట్లాడుతూ..”ఈ మూవీ కథను డైరెక్టర్ నాకు చెప్పిన తీరు బాగా నచ్చింది. ఎందుకంటే నేడు మోడలింగ్ లో అనేక మంది తమ టాలెంట్ చూపించేందుకు కష్టపడుతున్నారు. ఇక ఇండస్ట్రీలో చాలా మంది లెస్బియన్లుగానే జీవిస్తున్నారు. అందుకే ఈ పాత్రలో నటించాలనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మరో హీరోయిన్ నిరంజన మాట్లాడుతూ.. “నేటి సమాజంలో జరుగుతున్న అంశాన్నే మేం సినిమాగా తెరకెక్కించాం. ఒక నటిగా నేను డైరెక్టర్ చెప్పిందే చేస్తా. ఈ సినిమాలో నా పాత్ర చూసి.. నన్ను లెస్బియన్ మద్దతుదారులా? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కేవలం ఒక సమస్యను మాత్రమే డైరెక్టర్ చూపించారు” అని ఆమె చెప్పుకొచ్చింది. మరి ఈ యంగ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి