iDreamPost

ఆ నిర్మాత నా బుగ్గలు గిల్లాడు! మద్యం తాగమని బలవంతం చేశాడు: స్టార్ నటి

  • Author Soma Sekhar Published - 04:26 PM, Thu - 22 June 23
  • Author Soma Sekhar Published - 04:26 PM, Thu - 22 June 23
ఆ నిర్మాత నా బుగ్గలు గిల్లాడు! మద్యం తాగమని బలవంతం చేశాడు: స్టార్ నటి

సినిమా ఇండస్ట్రీలోకి తమలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకోవడానికి చాలా మంది వస్తుంటారు. అలా వచ్చిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని వారిని లోబరచుకోవాలని చూస్తుంటారు కొందరు. ఈ క్రమంలోనే వారిపై లైంగిక దాడులు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ నటి ఓ షో నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసింది. తనను లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బుగ్గలను ఆ నిర్మాత గిల్లాడని, రూమ్ లో ఎవరూ లేని సమయంలో బలవంతం చేశాడని ఆమె తన ఫిర్యాదులో చెప్పుకొచ్చింది.

తారక్ మెహతా కా ఉల్టా చష్మా.. బాలీవుడ్ లో ప్రముఖ కామెడీ షో. బాలీవుడ్ లో ఫేమస్ అయిన ఈ షో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక ఈ షో నిర్మాతలపై పలువురు నటీమణులు తమను లైంగికంగా వేధిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయడమే కాకుండా ఆ షో నుంచి ఒక్కొక్కరుగా వెదొలిగారు కూడా. ఇక ఈ షోలో పాల్గొన్న స్టార్ నటి జెన్నిఫర్ మిస్త్రీ సంచలన ఆరోపణలు చేసింది. షో నిర్మాత అసిత్ మెదీతో పాటుగా ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్ లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

కాగా.. జెన్నిఫర్ మిస్త్రీ తన ఫిర్యాదులో ఈ విధంగా పేర్కొంది.”నిర్మాత అసిత్ మోడీ నా చెంపలు గిల్లాడు. అదీకాక నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నా రూమ్ మేట్ లేని టైమ్ లో వచ్చి మద్యం తాగాలని బలవంతం చేసేవాడు. ఇక అతడు చెప్పినట్లుగా చేయకపోతే.. తన పనిలో తప్పులు ఎత్తిచూపేవాడు. కొన్నికొన్ని సార్లు ఫోన్ లో మాట్లాడుతూనే.. నిన్ను కౌగిలించుకోవాలని ఉందంటూ అసభ్యకరంగా మాట్లాడేవాడు” అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జెన్నిఫర్ మిస్త్రీ పేర్కొంది. షూటింగ్ సమయాల్లొ కూడా చాలా ఇబ్బందులు పెట్టేవాడని వాపోయింది జెన్నిఫర్ మిస్త్రీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి