iDreamPost

తెరపైకి 7/G బృందావన కాలనీ సీక్వెల్! హీరో చెప్పిన నిజాలు!

  • Author ajaykrishna Updated - 12:47 PM, Thu - 21 September 23
  • Author ajaykrishna Updated - 12:47 PM, Thu - 21 September 23
తెరపైకి 7/G బృందావన కాలనీ సీక్వెల్! హీరో చెప్పిన నిజాలు!

ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్స్ గా పిలుచుకునే సినిమాలు.. ఎన్నేళ్ల తర్వాత చూసినా ఆ ఫీల్ అలాగే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.. అందులో ఉండే ప్రతీ సన్నివేశం, సాంగ్స్ అన్ని మనకు తెలిసినా.. చివరిదాకా చూడాలని అనిపిస్తుంది. అలాంటి సినిమాలలో ఒకటి ‘7/జి బృందావన కాలనీ’. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2004లో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కి.. తెలుగు, తమిళ భాషలలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. ఇదే సినిమాతో హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 22న రీ రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ ఇటీవలే విడుదల చేయగా.. అంతే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి హీరో రవికృష్ణ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

7/జి బృందావన కాలనీ.. ఈ సినిమా 2004లో వచ్చిన ఈ సినిమాకు ఇంకా దానికి ఉండే ఫ్యాన్ బేస్ అలాగే ఉందని చెప్పాలి. దశాబ్దాల సినీ చరిత్రలో లెక్కలేనన్ని ప్రేమకథలతో సినిమాలు వచ్చాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో బరువును మిగిల్చాయి. వాటిల్లో ఒకటి 7/జి బృందావన్‌ కాలనీ. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారని తెలియగానే ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఉత్సాహం మెుదలైంది. సెప్టెంబర్ 22న ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో రవికృష్ణ 7/జి బృందావన్ కాలనీకి సీక్వెల్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని, అదే టీమ్ తో సినిమాని తెరకెక్కిస్తామని రవికృష్ణ తెలిపాడు. అయితే హీరోయిన్ మాత్రం సోనియా కాదని తెలిపాడు. ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ తీసుకుంటామని పేర్కొన్నాడు. ఈ సినిమాను 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన 7/జి బృందావన్ కాలనీ మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత సీక్వెల్ రాబోతుండటంతో.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ సూపర్ హిట్ గా నిలిచింది.

కాగా.. ఈ సినిమాకు కథాకథనాలతో పాటు యువన్ శంకర్ రాజా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ హైలైట్స్ గా నిలిచాయి. అయితే హీరోయిన్ సోనియా అగర్వాల్ ప్లేస్ లో మలయాళం బ్యూటీ అనశ్వర రాజన్ ని ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి.. కొన్నాళ్ళుగా హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటిదాకా మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఈ భామ.. ప్రస్తుతం తమిళ, హిందీ భాషలలో కూడా నటిస్తోంది. కానీ.. తెలుగులో ఇంకా ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి ఈ క్రేజీ సీక్వెల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి