iDreamPost

వైసిపి నేత హత్య కేసు.. లొంగిపోయిన నిందితులు..

వైసిపి నేత హత్య కేసు.. లొంగిపోయిన నిందితులు..

ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీస్స్టేషన్లో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ హత్యను తామే చేశామంటూ సురేష్, మోహన్, హేమంత్లు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. నిందితులు ముగ్గురూ ఎంపీటీసీ సభ్యుడు బజారియా వర్గీయులు కావడం గమనార్హం.

హతుడు గంజి ప్రసాద్కు, బజారియాకు మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఒకవైపు ఈ హత్య.. వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే చేయించాడంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే.. మృతుడు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాగా.. ఆయనపై గ్రామంలోని వైసీపీ కార్యకర్తలంతా మూకుమ్మడిగా దాడికి పాల్పడిన కొద్ది నిమిషాల్లోనే నిందితులు లొంగిపోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి