iDreamPost

భారత క్రికెట్ లో విషాదం.. 2007 టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ జట్టు మేనేజర్ మృతి!

  • Author Soma Sekhar Published - 03:12 PM, Thu - 3 August 23
  • Author Soma Sekhar Published - 03:12 PM, Thu - 3 August 23
భారత క్రికెట్ లో విషాదం.. 2007 టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ జట్టు మేనేజర్ మృతి!

భారత క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా జట్టుకు మేనేజర్ గా వ్యవహరించిన సునీల్ దేవ్ (75) మరణించారు. గత కొద్ది కాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. గురువారం తుదిశ్వాస విడిచారు. టీమిండియా క్రికెట్ కు ఆయన ఎన్నో సేవలు చేశారు. ఇక గతంలో ఆయన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. బీసీసీఐ సబ్ కమిటీలలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా తన సేవలను అందించారు సునీల్ దేవ్.

భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. మహేంద్రసింగ్ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచ కప్ టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి జట్టుకు మేనేజర్ గా వ్యవహరించిన సునీల్ దేవ్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. టీ20 ప్రపంచ కప్ తో పాటుగా 1996లో సౌతాఫ్రికా పర్యటన, 2014లో ఇంగ్లాండ్ టూర్ లో కూడా సునీల్ దేవ్ టీమిండియాకు మేనేజర్ గా తన సేవలను అందించారు. ఆయన మరణం పట్ల పలువుకు క్రీడా దిగ్గజాలు, ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: లగ్జరీ కారు కొన్న టీమిండియా క్రికెటర్! ధర ఎంతంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి