iDreamPost

షాకింగ్: మహిళ కడుపులో 15 కిలోల కణతి.. తొలగించిన వైద్యులు!

షాకింగ్: మహిళ కడుపులో 15 కిలోల కణతి.. తొలగించిన వైద్యులు!

మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కడుపులో ఉన్న దాదాపు 15 కిలోల కణతిని వైద్యులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ ప్రాంతంలో ఓ మహిళ (41) నివాసం ఉంటుంది. అయితే ఆమెకు గత కొన్ని రోజుల నుంచి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుండేది. దీంతో ఆ మహిళ గతంలో స్థానిక వైద్యుడిని సంప్రదించి మందులు వేసుకుంది. అలా కొన్ని రోజుల పాటు ఆ మహిళకు ఎలాంటి నొప్పి కలగలేదు.

కాగా ఇటీవల ఆ మహిళకు ఆ కడుపు నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే ఆ మహిళ కుటుంబ సభ్యులు ఇండర్ లోని ఓ వైద్యుడిని సంప్రదించారు. పరీక్షలు జరిపిన వైద్యులు.. ఆమె కడుపులో భారీ కణతి ఉందని గ్రహించారు. ఇక డాక్ట‌ర్ అతుల్ వ్యాస్ నేతృత్వంలో దాదాపు 12 మంది డాక్ట‌ర్లు శ్రమించి ఆ మహిళ కడుపులో ఉన్న 15 కిలోల కణతిని తొలగించారు. దీంతో ఆ మహిళ వైద్య బృంధానికి ధన్యవాదాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ గురవుతున్నారు.

ఇది కూడా చదవండి: బట్ట బొమ్మతో వ్యక్తి పెళ్లి, సంసారం.. పిల్లలు కూడా ఉన్నారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి