iDreamPost

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయి ఆదాయం..

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయి ఆదాయం..

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఇవాళ ఒక్కరోజే రూ.1,09,82000ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గత తెలిపారు. ఇప్పటి వరకు యాదాద్రి చరిత్రలో రూ.కోటి మించి ఆదాయం రాలేదు.

Yadadri Temple : యాదాద్రిలో శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా - 10TV Telugu

యాదాద్రిని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు కార్తీక మాసం కావడంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఈ క్రమంలో ఇవాళ రూ.కోటికిపైగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

యాదాద్రికి పోటెత్తిన భక్తులు..

వివిధ సేవలు, కౌంటరు విభాగాల ద్వారా ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,3600, వీఐపీ దర్శనం టికెట్లకు రూ.22,62000, వ్రతాల ద్వారా రూ.13,44000, కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50000, బ్రేక్‌ దర్శనం టికెట్ల ద్వారా రూ.6,95000లు సహా వివిధ సేవల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్టు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి