iDreamPost

2024 ఎన్నికల్లో YSRCP ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చి చెప్పిన వేణుస్వామి!

  • Published Mar 26, 2024 | 10:40 AMUpdated Mar 26, 2024 | 11:25 AM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికి తెలిసిందే. తరుచూ ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. యితే తాజాగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు, ముఖ్యమంత్రి సీఎం జగన్ పై పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు.

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికి తెలిసిందే. తరుచూ ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. యితే తాజాగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు, ముఖ్యమంత్రి సీఎం జగన్ పై పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు.

  • Published Mar 26, 2024 | 10:40 AMUpdated Mar 26, 2024 | 11:25 AM
2024 ఎన్నికల్లో YSRCP ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చి చెప్పిన వేణుస్వామి!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికి తెలిసిందే. తరుచూ ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. అలాగే సెలబ్రెటీల జాతకాలతో పాటు ఎవరు ఎప్పుడు విడిపోతారు, ఎవరు ఎప్పుడు చనిపోతారు అనే అంశంలపై ముందుగానే చెప్పడంలో వేణు స్వామి ఎంతో ఎక్స్ పార్ట్. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ సినీ రంగంలో మంచి సక్సెస్ ల కోసం ఆయనతో ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకుంటున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఎవరు సినిమాలు సక్సెస్ అవుతాయి ఎవరు సినిమాలు ఫ్లాప్ అవుతాయో కూడా ఈయన చాలా అవలీలగా చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే.. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి అలాగే ఆయన ఆరోగ్య పై సైతం ముందుగానే జోస్యం చెప్పేయడంతో.. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈయన క్రేజ్ అమాంతం పేరిగిపోయింది. ఇక ఈ మధ్యనే రాజకీయ నాయకుల జాతకాలు గురించి కూడా ఆయన చెప్పిన విధంగానే జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు, ముఖ్యమంత్రి సీఎం జగన్ పై పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి ఏపీ ఎన్నికల విషయం పై అలాగే సీఎం జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో.. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్ గెలుస్తారా.. ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారో అనే విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే.. ఏపీలో మరోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని వేణు స్వామి కుండబద్దలు కొడుతూ చెప్పేశారు. అలాగే రానున్న ఈ ఎన్నికల్లో సీఎం జగన్ 175 స్థానాలకు 135 సీట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు.

Jagan is a CM

అలగే భవిష్యత్తులో అనగా 2029 ఎన్నికల్లో కూడా జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణు స్వామి తెలిపారు. అంతేకాకుండా.. భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీ కనుమరుగవుతోందని ఆయన అన్నారు. ఇక షర్మిల, జగన్ పక్కన ఉండి ఉంటే.. కచ్చితంగా రాజకీయ ప్రస్తావం తనకు దక్కేదని, కానీ, ఇప్పుడు ఆమె పాలిటిక్స్ కలిసి రావని వేణు స్వామి చెప్పుకొచ్చారు. మరి, వేణు స్వామి చెప్పినట్టుగా వైసీపీ 135 స్థానాల్లో విజయం సాధించి జగన్ మరోసారి సీఎం అవుతారేమో చూడాలి. అయితే ప్రస్తుతం వేణుస్వామి ఏపీ ఎన్నికల కోసం, సీఎం జగన్ కోసం చెప్పిన జ్యోసం అనేది నెట్టింట వైరల్ గా మారింది.  మరి, ఈసారి ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్ గెలుస్తారని వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి