iDreamPost

U-19 Asia Cup: నేపాల్​పై టీమిండియా యంగ్ బౌలర్ అద్భుతం.. ఏకంగా 7 వికెట్లతో..!

  • Author singhj Published - 07:48 PM, Tue - 12 December 23

ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు అండర్-19 టీమ్స్ నుంచి వచ్చారు. తమ టాలెంట్​ను నిరూపించుకొని ఏకంగా నేషనల్ టీమ్స్​కు కూడా ఆడారు. తాజాగా మరో అండర్​-19 ప్లేయర్ తన సత్తా చాటాడు.

ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు అండర్-19 టీమ్స్ నుంచి వచ్చారు. తమ టాలెంట్​ను నిరూపించుకొని ఏకంగా నేషనల్ టీమ్స్​కు కూడా ఆడారు. తాజాగా మరో అండర్​-19 ప్లేయర్ తన సత్తా చాటాడు.

  • Author singhj Published - 07:48 PM, Tue - 12 December 23
U-19 Asia Cup: నేపాల్​పై టీమిండియా యంగ్ బౌలర్ అద్భుతం.. ఏకంగా 7 వికెట్లతో..!

నేషనల్ టీమ్స్​కు ప్లేయర్లను అందించడంలో ఈ మధ్య లీగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీ20ల్లో దుమ్మురేపిన యంగ్​స్టర్స్​ను పిలిచి మరీ జాతీయ జట్టులోకి తీసుకుంటున్నారు. ఆ దేశం, ఈ దేశం అని కాదు.. చాలా దేశాల క్రికెట్ బోర్డులు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. అలాగని పూర్తిగా లీగ్స్​కు ప్రాధాన్యం ఇస్తున్నాయని కాదు. డొమెస్టిక్ లెవల్లో రాణిస్తున్న వారిని టెస్టులు, వన్డే ఫార్మాట్లకు సెలక్ట్ చేస్తున్నాయి. లీగ్స్​లో ఆడిన వారిని ఎక్కువగా టీ20లకు తీసుకుంటున్నాయి. అయితే ఇప్పటికి కూడా దేశవాళీ క్రికెట్​కు ఉన్న ఇంపార్టెన్స్ తగ్గడం లేదు. అండర్-15, అండర్-19 నుంచి వస్తున్న యంగ్​స్టర్స్ ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడి సత్తా చాటితే నేషనల్ టీమ్స్​కు ఎంపిక అవుతున్నారు. ముఖ్యంగా అండర్-19లో ఆడిన చాలా మంది క్రికెటర్లు ఇంటర్నేషనల్ స్టార్లుగా ఎదగడం చూస్తూనే ఉన్నాం.

విరాట్ కోహ్లీ నుంచి కేన్ విలియమ్సన్ దాకా చాలా మంది ప్లేయర్లు అండర్-19 ద్వారా వెలుగులోకి వచ్చిన వారే. అండర్-19 వరల్డ్ కప్​లో సత్తా చాటిన కోహ్లీ, కేన్ మామ తమ దేశాల జట్లకు సెలక్ట్ అయ్యారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని టీమ్స్​లో సెటిలయ్యారు. ఆ తర్వాత తమ టాలెంట్​ను మరింత మెరుగుపర్చుకొని స్టార్లుగా మారారు. ప్రస్తుత క్రికెట్​లో వాళ్లిద్దరూ సూపర్​స్టార్లు అనేది తెలిసిందే. టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ కూడా అండర్-19 వరల్డ్ కప్​ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్లేయరే. అందుకే భారత సెలక్టర్లు, క్రికెట్ బోర్డు కూడా కుర్రాళ్లపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. అక్కడ రాణించిన వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చి సానబెడుతున్నారు. ఇక, ఒక యంగ్ బౌలర్ బంతితో మ్యాజిక్ చేయడంతో ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్​లో టీమిండియా సెమీస్​కు చేరుకుంది.

నేపాల్​తో మంగళవారం జరిగిన మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ సెమీస్​ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన నేపాల్​ను భారత పేసర్ రాజ్ లింబానీ చావుదెబ్బ తీశాడు. అతడి అద్భుత బౌలింగ్​కు ప్రత్యర్థి బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్​కు క్యూ కట్టారు. మొత్తంగా 9.3 ఓవర్లు వేసిన లింబానీ.. 13 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీశాడు. అందులో మూడు మెయిడిన్లు ఉండటం విశేషం. అతడు ఇచ్చిన 13 పరుగుల్లో 2 వైడ్స్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విక్టరీతో భారత్ సెమీఫైనల్ బెర్త్ దాదాపుగా ఖాయమైంది. ఫస్ట్ మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​ను ఓడించిన యంగ్ ఇండియా.. రెండో మ్యాచ్​లో పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. అయితే దాని నుంచి కోలుకొని మూడో మ్యాచ్​లో నేపాల్​ను మట్టికరిపించింది. మరి.. యువ బౌలర్ లింబానీ పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Team India: సూర్య, అయ్యర్ కాదు.. టీమిండియాలో అతడే డేంజర్ అంటున్న కలిస్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి