iDreamPost

సాహసం: సముద్రంలోకి దూకి ఇద్దరి ప్రాణాలను కాపాడిన పోలీస్!

సాహసం: సముద్రంలోకి దూకి ఇద్దరి ప్రాణాలను కాపాడిన పోలీస్!

పోలీసులు చేసే సేవలకు వారిని మనం ఎంత పోగిడినా తక్కువే. కొన్ని సార్లు విధుల్లో భాగంగా రాత్రి, పగలు కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజలకు రక్షణగా ఉంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో ఓ పోలీసన్న చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక డీజీపీ సైతం ఆ పోలీస్ అధికారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక స్థానికులు కూడా ఆ పోలీస్ చేసిన సహసాన్ని మెచ్చుకుంటూ శభాష్ పోలీసన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఏపీలోని బాపట్ల జిల్లా కొత్తపట్నం బీచ్ లో ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో చాలా మంది ఆ బీచ్ అందాలను చూడటానికి వస్తున్నారు. ఇలా వచ్చిన ఇద్దరు పర్యాటకులు ఉన్నట్టుండి సముద్రంలోని అలల తాకిడికి కొట్టుకుపోతూ.. కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేశారు. ఈ దృశ్యాన్ని చూసి ఓ మెరైన్ పోలీస్ అప్రమత్తమయ్యాడు. ఇక తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ సముద్రంంలోకి దూకి ఆ ఇద్దరు పర్యాటకుల ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. దీంతో ఆ పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం వారిని ప్రథమ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక వాళ్లు కోలుకున్నాక వారి బంధువులకు అప్పగించారు. అయితే ఈ పర్యాటకులు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకి వారి ప్రాణాలను కాపాడిన పోలీసన్న సహసాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఇతడి చేసిన పనికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సైతం ప్రత్యేకంగా అభినందించారు. ఆ పోలీస్ చేసిన సహసాన్ని చూసి నెటిజన్స్ హ్యాట్సాఫ్ పోలీసన్నా అంటూ కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: సెల్ టవర్ ఎక్కి పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి