iDreamPost

ఉగ్రవాద కాల్పుల్లో టీవీ నటి మృతి

ఉగ్రవాద కాల్పుల్లో టీవీ నటి మృతి

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బుధవారం రాత్రి వరుస ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఓ టీవీ నటిని కాల్చి చంపడం అక్కడి ప్రజల్లో కలకలం రేపింది. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని సామాన్య ప్రజలని టార్గెట్ చేసి కాల్పులు చేపడుతున్నారు. బుధవారం రాత్రి బూద్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు వరుస కాల్పులు చేశారు.

ఇంట్లో ఉన్న ఓ కాశ్మీరీ టీవీ నటి అమ్రీన్‌ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించినా అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కాల్పుల్లో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్‌ జుబీర్‌కు కూడా బుల్లెట్‌ గాయమైనట్టు పోలీసులు తెలిపారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో బుధవారం రాత్రి నుంచే పోలీసులు, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో గాలింపు చర్చలు మొదలుపెట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి