iDreamPost

అన్నవరం ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు

అన్నవరం ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు

తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత గాంచిన తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన విజయవాడ దుర్గ గుడి, సింహాచలం అప్పన్న దేవస్థానం, ద్వారకా తిరుమల దేవాలయాలకు కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా అన్నవరం దేవస్థానానికి పాలక మండలిని నియమించింది.

ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు చైర్మన్‌గా, ప్రధాన అర్చకుడు సభ్యుడుగా మొత్తం 16 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. రెండేళ్లపాటు ఈ పాలక మండలి కొనసాగనుంది. అన్నవరం దేవస్థానానికి తెలుగు రాష్ట్రాల నుంచి దంపతులు సత్యానారాయణ వ్రతం చేయించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తుంటారు.

పాలక మండలి సభ్యులు వీరే…

1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్‌)
2. సాధు దుర్గ
3. కర్రి భామిరెడ్డి
4. కలగా రామజోగేశ్వర శర్మ
5. వాసిరెడ్డి జగన్నాథం
6. నత్రా మహేశ్వరి
7. గాదె రాజశేఖరరెడ్డి
8. చిట్టూరి సావిత్రి
9. అప్పారి లక్ష్మి
10. ముత్యాల వీరభద్రరావు
11. మోకా సూర్యనారాయణ
12. చాగంటి వెంకట సూర్యనారాయణ
13. ములికి సూర్యవతి
14. బి. ఆశాలత
15. కర్రా వెంటకలక్ష్మి
16. కొండవీటి సత్యనారాయణ (ప్రధాన అర్చకుడు)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి