iDreamPost

నటుడి మరణం.. కంటతడి పెట్టుకున్న త్రిష!

నటుడి మరణం.. కంటతడి పెట్టుకున్న త్రిష!

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 25 ఏళ్లు గడుస్తున్నా చెక్కుచెదరని అందంతో ఇంకా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు త్రిష. ప్రస్తుతం మలయాళం, తమిళ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేస్తున్నారు. త్రిష 2016లో ‘నాయకి’ అనే బైలింగువల్‌ సినిమా చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది. నాయకి సినిమా తర్వాత ఆమె తెలుగులో నేరుగా సినిమాలు చేయలేదు. అయినప్పటికి డబ్బింగ్‌ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఓటీటీలో సందడి చేస్తున్నారు.

సినిమా షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే త్రిష సోషల్‌ మీడియాను చాలా తక్కువగా వాడతారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే పోస్టులు పెడుతుంటారు. అది కూడా అవసరం అనుకుంటేనే మాత్రమే పెడతారు. తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నటుడి మరణంపై ఎమోషనల్‌ పోస్టు పెట్టారు. ఒకరకంగా ఏడ్చినంత పని చేశారు. హాలీవుడ్‌లో బాగా పాపులారిటీ ఉన్న అ‍గ్నస్‌ క్లౌడ్‌ కొద్దిరోజుల క్రితం మరణించారు. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆయన డ్రగ్‌ ఓవర్‌ డోస్‌ కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. అతి చిన్న వయసులో 25 ఏళ్లకే అ‍గ్నస్‌ చనిపోవటం చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఇక, అగ్నస్‌ మరణం గురించి తెలిసిన త్రిష ఎమోషనల్‌ అయ్యారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. ‘‘ నీ ఆత్మకు శాంతి కలుగుగాక.. అగ్నస్‌ క్లౌడ్‌’’ అని పేర్కొన్నారు. కన్నీటి ఎమోజీని సైతం జత చేశారు. ఆ పోస్టు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, త్రిష హలీవుడ్‌ నటుడు అగ్నస్‌ క్లౌడ్‌ మరణంపై ఎమోషనల్‌ పోస్టు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి