iDreamPost

పెళ్లైన ఐదు నెలలకే..! పాపం, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు!

పెళ్లైన ఐదు నెలలకే..! పాపం, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు!

ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన హరిచందనకు ఈ ఏడాది మేలో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ నూతన దంపతులు సంతోషంగానే గడిపారు. కానీ, ఉన్నట్టుండి ఊహించని ఘటనతో వీరి సంసారం ఒక్కసారిగా కుప్పకూలిపోయి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో హరిచందన కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన రాజేష్ కు, ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన హరిచందనుకు (23) ఈ ఏడాది మే 30న వివాహం జరిగింది. దీంతో ఈ నూతన దంపతులు అప్పటి నుంచి ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే.. గత వారం రోజుల నుంచి హరిచందన తీవ్రమైన జ్వరంతో బాధ పడుతూ ఉంది. దీంతో ఆమె భర్త రాజేష్ వైరాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి చికిత్స అందించిన వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు.

వెంటనే రాజేష్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో హరిచందన చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో భర్త రాజేష్, మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. పెళ్లైన 5 నెలలకే హరిచందన మరణించడంతో స్థానికులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి