iDreamPost

భార్య మోసం.. పెళ్లైన నెలలోపే నవ వరుడు దారుణం..

భార్య మోసం.. పెళ్లైన నెలలోపే నవ వరుడు దారుణం..

ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైనది. అందుకే ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలని యువతి యువకులు ఎన్నో కలలు కంటారు. అలానే ఎందరో తమ పెళ్లిన ఘనంగా జరుపుకుంటారు. అయితే కొన్ని పెళ్లిళ్లు మాత్రం విషాధంగా మారుతున్నాయి. అందుకు కారణం అనుకోని ప్రమాదాలు ఒక కారణం కాగా.. భాగస్వామి మోసం కూడా  విషాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా   ఓ యువకుడు ఎన్నో ఆశలతో  వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తన భార్య మరోకరితో ప్రేమాయణం సాగిస్తుందని తెలుసుకుని మనస్తాపం చెందాడు. చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇక తన జీవితమే వృధా అని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

ఎన్టీఆర్ జిల్లాలోని ఊటూరు గ్రామానికి  చెందిన జక్కుల వంశీ(23)తో తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామానికి చెందిన యువతితో ఈనెల 3వ తేదీన వివాహమైంది. 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఊటుకూరులోనే నవ దంపతులు ఉన్నారు. ఇక 7వ తేదీన వధువు గ్రామమైన రావినూతనలకు బయల్దేరగా.. అదే సమయంలో భార్య ఫోన్ లో వేరొకరితో మాట్లాడటం వంశీ గమనించాడు. అయితే ఎవరితో మాట్లాడుతున్నావంటూ వంశీ ప్రశ్నించగా..తొలుత పొంతన లేని సమాధానలు చెప్పింది. చివరకు గట్టిగా నిలదీయగా  తన ప్రియుడు శ్రీకాంత్ తో మాట్లాడుతున్నాని చెప్పింది.. వెంటనే వధువును ..ఆమె తల్లిదండ్రులకు అప్పగించి అసలు విషయం చెప్పాడు.

వధువు తల్లిదండ్రులు, ప్రియుడు కలిసి వంశీని తూలనాడి అవమానించారు. దీంతో వంశీ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు తండ్రితో కలిసి ఇంటికి బయలు దేరాడు. అతడు మధిరాలో దిగి.. తండ్రిని ఊటుకూరు పంపించారు. మధిరలో గడ్డి మందు కొనుగోలు చేసి  ఇంటికి వెళ్లే మార్గం మధ్యలో తాగాడు. అనంతరం ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పాడు. వారు వంశీని  మధిరలోని ఓ ప్రవేటుఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 13వ తేదీ వంశీ పరిస్థితి విషమించింది. ఈక్రమంలో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అదే రోజు రాత్రి తుదిశ్వాస విడిచారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడు, తల్లిదండ్రులపై  కనకరావు ఫిర్యాదు  చేశాడు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి