iDreamPost

ఈ మాయలేడీని పట్టిస్తే నగదు బహుమతి! ఏం చేసిందంటే..

ఈ మాయలేడీని పట్టిస్తే నగదు బహుమతి! ఏం చేసిందంటే..

నేటికాలంలో అక్రమమార్గంలో డబ్బులను సంపాదించాలనుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కష్టపడి పని చేసుకుని సంపాందించిన డబ్బును కొందరు చోరీ చేస్తుంటారు. ఇలాంటి వారిలో మహిళలు కూడా ఉన్నారు. అలా  చోరీల్లో ఆరితేరిన వారి కోసం పోలీసులు గాలిస్తుంటారు.  కొందరిపై భారీగా నగదు బహుమతి కూడ ప్రకటిస్తారు. అలాంటిది పై ఫోటోలో కనిపిస్తున్న లేడి. ఈ లేడీ మాములు పర్సన్ కాదు.. జంతర్ మంతర్ కిలేడీ. ఎంతో మంచి మనిషి అనిపించేలా మెలుగుతుంది. కాసేపట్లో మాటలు కలుపుతుంది. సరైన టైమ్ చూసి  అందినకాడి దోచుకెళ్తుంది.

తూర్పూ గోదావరి జిల్లాలో జగదాంబా అలియాస్ బుజ్జి అనే మహిళ నివాసం  ఉంటుంది. మనకు బాగా కావాల్సిన వ్యక్తిలా పలకరిస్తుంది.  సొంత బంధువులా వచ్చి పక్కనే కూర్చుకుంటుంది. యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి  అడుగుతుంది. అలా మాటల్లోకి దింపి.. నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్‌ను ఒంటరిగా ఉన్న మహిళలకు ఇస్తుంది. వారు పూర్తిగా  స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. అనంతరం ఆ మాయలేడి యాక్షన్ లోకి దిగి ఇంట్లో ఉన్న నగలు, నగదును దోచుకుని పారిపోతుంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ నంగనాశిపై చాలా కేసులే ఉన్నాయి. ఈమె పట్టుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు.  ఆ కిలాడీ మాత్రం పోలీసులకు చిక్కకుండా తిరుగుతుంది.

ఆమెను పలు మార్గాల్లో అన్వేశించి.. పోలీసులు విసిగిపోయారు. చివరకు ఈ మోస్ట్ వాంటెడ్ లేడీ గురించి సమాచారం ఇస్తే నగదు బహుమతి ఇస్తామని జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈమెను పట్టిస్తే రూ.10వేలు ఇస్తామంటున్నారు. ఆఖరికి నగదు బహుమతి ప్రకటించారు. ఈ మాయలేడి జగదాంబ కనిపిస్తే.. 9491326456 లేదా 996333265 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఇంటికి గుర్తుతెలియన వ్యక్తులు వస్తే అస్సలు చనువుగా ఉండొద్దు. కేటుగాళ్లు రకరకాలు మారువేశాల్లో వచ్చి.. సంపాదించిన సొమ్మంతా ఎగరేసుకుపోతారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మరి… ఈ కిలాడీకి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి