iDreamPost

బీఆర్‌ఎస్‌ నేత కుమార్తె హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

  • Published Mar 11, 2024 | 8:29 AMUpdated Mar 11, 2024 | 9:17 AM

అస్ట్రేలియాలో నివాసం ఉంటున్న హైదరాబాద్ కు చెందిన మహిళ తాజాగా దారుణ హత్యకు గురైయింది. అయితే ఆమెపై అంతటి దారుణానికి ఒడిగట్టినది ఎవరు, ఎందుకో కారణం తెలిస్తే షాక్ అవుతారు.

అస్ట్రేలియాలో నివాసం ఉంటున్న హైదరాబాద్ కు చెందిన మహిళ తాజాగా దారుణ హత్యకు గురైయింది. అయితే ఆమెపై అంతటి దారుణానికి ఒడిగట్టినది ఎవరు, ఎందుకో కారణం తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Mar 11, 2024 | 8:29 AMUpdated Mar 11, 2024 | 9:17 AM
బీఆర్‌ఎస్‌ నేత కుమార్తె హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

వైవాహిక జీవితంలో ఈమధ్య చిన్న చిన్న తగాదాలు, పొరపాట్లకే పంతలకు పోతూ విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఏదైనా సరే క్షణికవేశంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి.  ఈ క్రమంలోనే భార్య భర్తల మధ్య వివాదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. కాగా, ఆమె మృతదేహాన్ని బక్లీలోని రోడ్డు పక్కన గల ఓ చెత్త డబ్బాలో అక్కడి పోలీసులు గుర్తించారు. అయితే ఆ మహిళ పై అంతటి దారుణానికి ఒడిగట్టినది ఆమె భర్తేనని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిదంటే..

ఇటీవలే ఆస్ట్రేలియాలో ఓ తెలుగు వైద్యురాలి మృతి ఘటన మరువక ముందే మరో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా మరో మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని బక్లీలో తెలంగాణకు చెందిన  శ్వేత దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాం విక్టోరియా బిక్లీలోని కచ్చా రోడ్డు పక్కనే ఉన్న ఓ చెత్త డబ్బాలో ఉన్నట్లు విక్టోరియా పోలీసులు గుర్తించారు. అయితే శ్వేత మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు హతురాలి భర్తే వచ్చి పోలీసులకు లొంగిపోవడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఏఎస్ రావు నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత బాల్ శెట్టి గౌడ్ కుమార్తె మధుగాని చైతన్య అలియాస్ శ్వేత కొన్నేళ్ల క్రితం వరికుప్పల అశోక్ రాజ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇతను కూడా హైదరాబాద్ కు చెందినవాడే.

కాగా, వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు అంగీకరించలేదని సమాచారం. అయితే వివాహానంతరం అశోక్ రాజ్, శ్వేత అస్ట్రేలియాలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య విభేదాలు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోమారు ఇద్దరి మధ్య వైరం ఏర్పాడడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్ తన ఇంట్లోనే భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహన్ని బెడ్ షీట్ లోని చుట్టి ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలో పెట్టాడు. ఇక తన వాహనంలోని ఆ డబ్బాను పెట్టుకుని మిర్కా వేకు 82 కిమీ దూరంలో ఉన్న బిక్లీ ప్రాంతంలోని ఓ నిర్మాన్యుష్యమైన కచ్చా రోడ్డు పక్కన పొదల్లో పడేశాడు. ఆ తర్వాత అశోక్ తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు.

ఇక బాలుడిని హైదరాబాద్ లో గల తమ ఇంట్లో వదిలేసి మళ్లీ వెంటనే ఆస్ట్రేలియా పయాణమయ్యాడు. ఈ లోపు బిక్లీ ప్రాంతానికి చెందిన స్థానికులు అనుమానస్పదంగా పడి ఉన్న చెత్త డబ్బాను గుర్తించి పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో విక్టోరియా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని , పోస్టుమార్టంకు తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు హతురాలు శ్వేతగా, అని ఆమె భర్త కుమారుడితో కలిసి హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. కానీ, ఇంతలోనే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా తిరిగి వచ్చిన అశోక్ విక్టోరియా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.దీంతో వారు అశోక్ ను అరెస్ట్ చేశారు. అయితే శ్వేత మృతదేహాన్ని హైదరాబాదుకు తరలించే అవకాశం లేదని అక్కడే అంత్యక్రియులు జరుగుతాయని సమాచారం తెలుస్తోంది. మరి, చిన్న వివాదానికే భార్యను, భర్త హతమార్చిన సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి