iDreamPost

ఆ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం.. భార్యపై భర్త దారుణం!

  • Published Apr 30, 2024 | 10:56 AMUpdated Apr 30, 2024 | 10:56 AM

Chikkamagaluru Crime News: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఆ సమస్యలతో తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Chikkamagaluru Crime News: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఆ సమస్యలతో తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  • Published Apr 30, 2024 | 10:56 AMUpdated Apr 30, 2024 | 10:56 AM
ఆ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం.. భార్యపై భర్త దారుణం!

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికే మనస్థాపానికి గురై తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్షణంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్య చేయడానికి సైతం తెగబడుతున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లైన కొంత కాలానికే భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలై చివరికి విడాకుల వరకు దారి తీస్తుంది. మరికొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి.అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు అనుమానాలు, ఆదిపత్య పోరు కారణంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యతో గొడవ పెట్టుకున్న భర్త దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన చిక్కమగళూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక చిక్కమగళూరు లో దారుణ ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్యను అతిదారుణంగా హతమార్చాడు భర్త. కాలువలో బట్టలు ఉతకడానికి వచ్చిన భార్యను కొడవలితో నరికి చంపి పారిపోయాడు. ఈ దారుణ ఘటన చిక్కమగళూరు జిల్లా తరికెరె తాలూకా కరకుచి గ్రామంలో చోటు చేసుకుంది.హత్యకు గురైన మృతురాలి పేరు మేఘన (20)గా గుర్తించారు. కొంత కాలం క్రితం మేఘన, చరణ్ కి పెళ్లైంది. కొత్తలో ఈ జంట హ్యాపీగా ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. ఈ కారణం చేతనే మేఘన తరుచూ తల్లిగారింటికి వస్తూ ఉండేది. భార్యాభర్త మధ్య గొడవ పెద్దది కావడంతో మేఘన రెండేళ్లుగా భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. రెండేళ్లలో చరణ్ పలుమార్లు తన భార్యను పంపమని అడిగినా.. మేఘన మాత్రం తాను వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.

ఎన్నిసార్లు తన వద్దకు రమ్మన్నా రాకపోవడంతో మేఘనపై చరణ్ కక్ష్య పెంచుకున్నట్లు తెలుస్తుంది. అదును కోసం ఎదురు చూస్తున్న చరణ్.. మేఘన ఒంటరిగా బట్టలు ఉతకడానికి వెళ్లడం గమనించాడు. తనతో తెచ్చుకున్న కొడవలితో విచక్షణారహితంగా కొట్టి నరికి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. మేఘన తల్లిదండ్రులు లక్కవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని నిందితుడు చరణ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి