ఈ హోటల్ లో కడుపునిండా తినడమే కాదు.. కంటి నిండా నిద్ర కూడా పోవచ్చు!

ఈ హోటల్ లో కడుపునిండా తినడమే కాదు.. కంటి నిండా నిద్ర కూడా పోవచ్చు!

ప్రపంచంలో మీరు చాలా రకాల హోటల్స్ చూసుంటారు. కొన్ని హోటల్స్ ని నేరుగా వెళ్లి చూస్తే.. మరికొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ని వీడియోల్లో చూసుంటారు. వాటిలో కొన్ని హోటల్స్ కి అయితే కచ్చితంగా వెళ్లాలి అని కూడా ఫిక్స్ అయి ఉంటారు. ఈ వార్త చదివిన తర్వాత ఒక్కసారి అయినా ఈ హోటల్ కి వెళ్లాలి అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు కడుపునిండా తినడమే కాకుండా.. కంటి నిండా నిద్ర కూడా పోవచ్చు. అందుకు మంచి మెత్తని పరుపులు వేసి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్ కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ హోటల్ ఎక్కడుందో కనుక్కుని వెంటనే బయల్దేరదాం అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ హోటల్ ఉన్నది మన దేశంలో కాదు. ఈ అద్భుతమైన హోటల్ జోర్డాన్ దేశం రాజధాని అమ్మాన్ ప్రాంతంలో ఉంది. అయితే ఆ రెస్టారెంట్లో ఏ వంటకం తిన్నా పడుకోవచ్చు అనుకోకండి. కేవలం వారి స్పెషల్ డిష్ తిన్ వారికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏర్పాట్లు అంటే సింపుల్ గా కాదండోయ్. మీరు పడుకునేందుకు ఏసీ రూమ్ లో మంచి పరుపులు వేసి ఉంటాయి. వారి ఫేమస్ డిష్ మన్సాఫ్ తిన్న తర్వాత వెళ్లి కచ్చితంగా కాసేపు కునుకు తీయాల్సిందే. ఈ డిష్ ని పులిసిన పెరుగు, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తారు. ఈ డిష్ తిన్న తర్వాత మీరు వద్దన్నా కూడా నిద్ర ముంచుకొస్తుందని చెబుతారు.

ఒకవేళ మీకు అలా నిద్ర రాకపోతే గనుక ఆ డిష్ లో ఏదో లోపం ఉన్నట్లే అనే అనుమానాలు కూడా వస్తాయి. ఈ డిష్ తింటే నిద్ర వస్తుంది అనే విషయాన్ని హోటల్ యాజమాన్యం మొదట్లో జోక్ గా తీసుకుందంట. అలాగే నిద్రపోయోందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తర్వాత ఒక సంప్రదాయంగా మారిపోయింది. మన్సాఫ్ డిష్ తిన్న తర్వాత కచ్చితంగా మీరు అక్కడ నిద్రపోవాల్సిందే. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ అంతా షాకవుతున్నారు. ఇలా కూడా హోటల్స్ ఉంటాయా అని నోరెళ్లబెడుతున్నారు. కొందరు మాత్రం జోర్డాన్ వెళ్తే కచ్చితంగా ఈ హోటల్ విజిట్ చేస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments