IND vs ENG Rohit Sharma Said Goal Is Fixed: మైల్​స్టోన్స్ ఎవడికి కావాలి.. టీమ్​లోని ప్రతి ఒక్కరి గోల్ అదే..: రోహిత్

Rohit Sharma: మైల్​స్టోన్స్ ఎవడికి కావాలి.. టీమ్​లోని ప్రతి ఒక్కరి గోల్ అదే..: రోహిత్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మైల్​స్టోన్స్ వల్ల ఎవరికి ఉపయోగమన్నాడు. టీమ్​లోని ప్లేయర్లందరి గోల్ ఒకటేనన్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మైల్​స్టోన్స్ వల్ల ఎవరికి ఉపయోగమన్నాడు. టీమ్​లోని ప్లేయర్లందరి గోల్ ఒకటేనన్నాడు.

మైల్​స్టోన్స్, రికార్డ్స్.. ఏ గేమ్​లోనైనా వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్​లోనూ మైలురాళ్లకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఎవరెన్ని సెంచరీలు కొట్టారు? ఎన్ని వికెట్లు తీశారు? లాంటి వాటి గురించి ఎప్పుడూ డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. పాత రికార్డులు బ్రేక్ అయినప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే మైల్​స్టోన్స్ ఎవరికి కావాలి అంటున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అవి దేనికీ పనికి రావన్నాడు. వ్యక్తిగత రికార్డులు, మైలురాళ్ల కంటే టీమ్ విజయమే తమకు ముఖ్యమన్నాడు హిట్​మ్యాన్. భారత జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి గోల్ ఒకటేనన్నాడు. తమ జట్టులో వ్యక్తిగత రికార్డుల కంటే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని స్పష్టం చేశాడు. అసలు రోహిత్ దేని గురించి ఇలా మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

2019 వన్డే వరల్డ్ కప్​లో రోహిత్ ఏకంగా 5 సెంచరీలు బాదాడు. అయినా ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్​షిప్ గెలవలేకపోయింది. 2023 ప్రపంచ కప్​లో రోహిత్​తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాట్​తో చెలరేగిపోయాడు. అయినా జట్టుకు కప్పును అందించలేకపోయారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్ని సెంచరీలు కొట్టామనేది కాదు.. కప్పు కొట్టామా? లేదన్నదే ముఖ్యమన్నాడు. 2019 వరల్డ్ కప్​లో తాను బాదిన ఐదు సెంచరీలు వేస్ట్ అయిపోయాని.. వాటి గురించి ఎవరూ డిస్కస్ చేయరని తెలిపాడు. టీమిండియాలో తాను ఓ మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. మైల్​స్టోన్స్, రికార్డ్స్, స్టాటిస్టిక్స్.. లాంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నాడు హిట్​మ్యాన్. ఇప్పుడు జట్టులో ఉన్న వారికి వాళ్ల వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే ప్రధానంగా మారిందన్నాడు.

టీమ్​లో కొన్ని మార్పులు తీసుకురావాలని నిశ్చయించుకున్నా. అందులో భాగంగానే ఆటగాళ్లు గ్రౌండ్​లో మరింత స్వేచ్ఛగా ఆడేలా చూస్తున్నా. వాళ్లు ఫుల్ ఫ్రీడమ్​తో ఆడుతున్నారు. రికార్డులు, స్టాటిస్టిక్స్, మైల్​స్టోన్ గోలను పక్కన పెట్టేసి.. గేమ్ మీదే పూర్తిగా ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు జట్టులోని ఆటగాళ్లు పర్సనల్ స్కోర్స్​ను పట్టించుకోవడం లేదు. టీమ్ గెలిచిందా లేదా అనే దాని పైనే వాళ్ల దృష్టి ఉంది. ఎందుకో గానీ మనం నంబర్స్​కు అతిగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాం. భారత్​లో స్కోర్లు, రికార్డుల గురించి ఎక్కువగా చర్చిస్తారు. కానీ దాని కంటే జట్టు గెలుపోటములే ముఖ్యం. మా టీమ్​లోని ప్రతి ఆటగాడు ఇప్పుడు వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే లక్ష్యంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. హిట్​మ్యాన్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అతడు చెప్పిన దాంట్లో తప్పు లేదని.. టీమ్ గెలిస్తే రికార్డులు బోనస్ అవుతాయని.. లేదంటే ఎన్ని మైల్​స్టోన్స్ క్రియేట్ చేసినా వృథానే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వ్యక్తిగత రికార్డుల కంటే టీమ్ గెలుపే ముఖ్యమంటూ హిట్​మ్యాన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments