వారందరికీ కోహ్లీనే స్ఫూర్తి! ద్రావిడ్‌ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకోనున్నాడు. ఈ రోజు వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుతో తన కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను కోహ్లీ ఆడనున్నాడు. ఎంతో ప్రత్యేకమైన ఈ 500వ మ్యాచ్‌లో కోహ్లీ మంచి ప్రదర్శన కనబర్చి.. మరింత స్పెషల్‌ మార్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ కంటే ముందు కేవలం 9 మంది ఆటగాళ్లు మాత్రమే 500 మార్క్‌ను అధిగమించారు.

ఇలాంటి ప్రత్యేకమైన మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ మాట్లాడుతూ.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న చాలా మంది క్రికెటర్లకు కోహ్లీనే నిజమైన స్ఫూర్తి అంటూ పేర్కొన్నాడు. అలాగే భారత మహిళా క్రికెటర్లలకు కూడా ఇన్స్పిరేషన్‌గా నిలిచాడని, అతనిలోని ఎనర్జీ, ఎంతుజియాజం అద్భుతమని రాహుల్‌ కొనియాడాడు. శ్రమ, క్షమశిక్షణతోనే కోహ్లీ ఇంత సుదీర్ఘ కాలం పాటు ఆటలో కొనసాగి ఇప్పుడు 500 మ్యాచ్‌ల మార్క్‌ అందుకుంటున్నాడని తెలిపాడు. కోహ్లీ నుంచి తాను కూడా చాలా నేర్చుకున్నానని తెలిపాడు.

కాగా.. రాహుల్‌ ద్రావిడ్‌ సైతం 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ఉన్నాడు. టీమిండియా తరఫున సచిన్‌ టెండూల్కర్‌, ధోని, ద్రావిడ్‌ మాత్రమే 500 ప్లస్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ఇప్పుడా క్లబ్‌లో కోహ్లీ చేరబోతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మ్యాచ్‌లు(వన్డే, టెస్ట్‌, టీ20లు కలుపుకుని) ఆడిన క్రికెటర్ల జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టు తర్వాత కోహ్లీ 500 మ్యాచ్‌లతో ఆ జాబితాలో 10వ స్థానంలో నిలుస్తాడు. మరి కోహ్లీ గురించి ద్రావిడ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యూవీ దెబ్బకు అతని కెరీర్‌ క్లోజ్‌ అనుకున్నారు! కానీ, చరిత్ర సృష్టించాడు

Show comments