డైరెక్ట్ గా OTT లోకి కాజల్ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Kajal Bollywood Movie In OTT: వెండి తెరపై అలరించిన స్టార్ నటి నటులంతా కూడా.. ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటి నటులు ఓటీటీ మూవీ లవర్స్ ను సర్ప్రైజ్ చేయగా.. ఇప్పుడు మరొక హీరోయిన్ ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది.

Kajal Bollywood Movie In OTT: వెండి తెరపై అలరించిన స్టార్ నటి నటులంతా కూడా.. ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటి నటులు ఓటీటీ మూవీ లవర్స్ ను సర్ప్రైజ్ చేయగా.. ఇప్పుడు మరొక హీరోయిన్ ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది.

ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలకు, సిరీస్ లకు బాగా ఆదరణ పెరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు.. ఇక స్ట్రీమింగ్ అయినా వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చే సినిమాలే.. ఓటీటీ లకు పెరుగుతున్న క్రేజ్ గురించి చెప్పేస్తున్నాయి . ఇక ఓటీటీ లో సినిమాలంటే థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాతే ఓటీటీ లోకి వచ్చేవి . కానీ ఇప్పుడు అనేక కారణాల వలన కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే సినిమాలలో వెండి తెరపై అలరించిన స్టార్ నటి నటులు.. అలరించడం విశేషం. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతో మంది నటి నటులు ఓటీటీ లలో ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా.. ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఆ సినిమాకు సంబంధించిన విషయాలు చూసేద్దాం.

తెలుగు ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఎవరైనా ఈ అమ్మడు నటనకు ఫిదా అవ్వాల్సిందే. అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడు కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఫ్యామిలికి టైమ్ ఇచ్చింది. ఇక ఇప్పుడు కాజల్ వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోతుంది. రీసెంట్ గా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ సత్యభామ పేరుతో.. కాజల్ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కాజల్ అగర్వాల్ నటించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశంతో సాగిన ఈ సినిమా.. థియేటర్ లో యావరేజ్ టాక్ సంపాదించుకున్న కానీ ఓటీటీ ప్రేక్షకులను మాత్రం బాగానే మెప్పించింది. ఇక ఇప్పుడు కాజల్.. చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో “ఉమా” అనే పేరుతో ఓ సినిమాను చేసింది. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇక ఉమా సినిమా మిస్టరీ థ్రిలర్ తరహాలో రూపొందించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో డైరెక్ట్ గా రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇప్పటివరకైతే ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట మేకర్స్. కాబట్టి ఈ సినిమా గురించి పూర్తి సమాచారం వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ ప్రస్తుతం కాజల్ ఇండియన్ 3 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం.. ఈ సినిమాతో పాటు కాజల్ కొన్ని ప్రయోగాత్మకమైన కథలను కూడా వింటున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి కాజల్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లో కి రానుందనే అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments