Sanga Reddy District Crime News: మరికొన్ని రోజుల్లోనే పెళ్లి.. పాపం, అంతలోనే..

మరికొన్ని రోజుల్లోనే పెళ్లి.. పాపం, అంతలోనే..

ఈమె పేరు లక్ష్మి. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఈ యువతి కొంత వరకు చదువుకుంది. అయితే ఇటీవల ఈమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి కావడంతో లక్ష్మి తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మరికొన్ని రోజుల్లోనే పెళ్లి.. కానీ, అంతలోనే ఈ యువతి ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. లక్ష్మి ఇలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి పరిధిలోని అర్జున్ నాయక్ తండాలో లక్ష్మి అనే యువతి తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటుంది. అయితే ఈమె కుటుంబ సభ్యులు ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఆమె తల్లిదండ్రులు స్థానికంగా ఉండే ఓ యువకుడితో ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. దసరా, దీపావళి మధ్యలో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి అన్ని ఏర్పాటు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో తెలియదె కానీ.., లక్ష్మి ఉన్నట్టుండి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే పెళ్లి ఉంది అనగా లక్ష్మి ఇలా చేయడంతో అంతా శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments