Hyderabad Saroornagar Crime News: భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. ఆపై!

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. ఆపై!

హైదరాబాద్ లో మరో దారుణం వెలుగు చూసింది. ఓ భర్త కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇంతటితో సరిపెట్టకుండా మరో ఘాతుకానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలు భర్త భార్యను ఎందుకు హత్య చేశాడు? ఆ తర్వాత అతడు చేసిన మరో దారుణం ఏంటి? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నాగోల్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో రాములు-సంతోషి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. తాజాగా రాములు కిరాతకానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అతడు సరూర్ నగర్ లో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకుని ఇరువురి కుటుంబ సభ్యులు షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు రాములు తన భార్యను ఎందుకు హత్య చేశాడు? అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments