రజనీకాంత్ సినిమాలో అనవసరంగా నటించా: స్టార్ హీరోయిన్!

సూపర్ స్టార్ సినిమాలో చిన్న పాత్ర అయిన చేస్తే బాగున్న అని చాలామంది హీరోయిన్స్ అనుకుంటారు. కానీ, తాజాగా ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఆయన సినిమాలో అనవసరంగా నటించనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సూపర్ స్టార్ సినిమాలో చిన్న పాత్ర అయిన చేస్తే బాగున్న అని చాలామంది హీరోయిన్స్ అనుకుంటారు. కానీ, తాజాగా ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఆయన సినిమాలో అనవసరంగా నటించనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సినీ ఇండస్ట్రీలో ఏలాంటి హీరోయిన్లు అయినా పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేయాలని కలలు కంటారు. ఈ క్రమంలోనే ఆయా సినిమాల్లో అవకాశాలు కోసం ఎంతగానే కష్టపడతారు. తీరా ఆ హీరోల సినిమాల్లో ఒక్కసారి అవకాశం వచ్చిందంటేచాలు.. ఎగిరి గంతేస్తుంటారు. ఇకపోతే సినిమాలో పాత్ర నిడివి చిన్నదైనా సరే ఆగ్ర హీరోలతో సినిమా కాబట్టి అస్సలు మిస్ చేసుకోవాలని అనుకోరు. కానీ,  తాజాగా ఓ స్టార్ హీరోయిన్ మాత్రం అనవసరంగా ఓ స్టార్ హీరో సినిమాలో నటించనంటూ బాధపడింది. మరి ఇంతకి ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. సూపర్ సటార్ రజనీకాంత్. ఆయన సినిమాలో నటించకుండా ఉంటే బాగున్ను అంటూ ఓ హీరోయిన్ తాజా ఇంటర్వ్యూలో  షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకి ఏం జరిగిందంటే..

సూపర్ స్టార్ సినిమాలో చిన్న పాత్ర అయిన చేస్తే బాగున్న అని చాలామంది హీరోయిన్స్ అనుకుంటారు. కానీ, తాజాగా స్టార్ హీరోయిన్ ‘మమతా మెహన్ దాస్’ మాత్రం అనవసరంగా ఆయన సినిమాలో నటించనంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకి ఏం జరిగిందంటే.. ఇటీవలే చాలాకాలం తర్వాత స్టార్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ విజయ్ సేతుపతి మహారాజా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ సినిమా గత వారం జూన్ 14వ తేదీ శుక్రవారం నాడు థీయేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా ఇటు తమిళ్ లో కాకుండా.. తెలుగులో కూడా విడుదల మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమాలో ప్రమోషన్స్ లో పాల్గొన మమతా.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

కాగా, మమతా మోహన్ దాస్ రజనీకాంత్ హీరోగా 2008లో వచ్చిన కుసేలన్‌ (తెలుగులో కథానాయకుడు) సినిమాలో ఓ సాంగ్ లో నటించింది. ఇక ఈ పాట కోసం మమతా రెండు రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లిందట. కానీ, ఆ సినిమా ఎడిటింగ్‌లో ఆమె పార్ట్‌ మొత్తం డిలీట్‌ చేసి, కేవలం ఒక సెకన్ మాత్రమే  తెరపై చూపించారట. అసలు రిలీజ్ తర్వాత ఆ పాటను చూసి తెగ ఫీలయిందట. అంతేకాకుండా.. అనవసరంగా రజనీకాంత్‌ సినిమాలో నటించానని బాధపడిందట. ప్రస్తుతం మమతా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే గతంలో రజనీకాంత్ కుసేలన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో మతా స్పెషల్‌ సాంగ్‌ చేస్తుందని ముందుగా నయన్‌కు తెలియదట. కానీ, విషయం తెలసిన తర్వాత ఆ పాట షూటింగ్‌కి తాను రాలేనని నయన్‌ చెప్పేసిందట. ఎందుకంటే.. వేరే హీరోయిన్‌ నటిస్తుందని ముందే ఎందుకు చెప్పలేదని డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లే మమతా పార్ట్ ను అప్పటిలో కట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఇదివరకే మమతా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం గమన్హారం.

 

Show comments