పెళ్లైన తొలి రోజే ఆస్పత్రిలో చేరిన వధువు..భర్త తీరు చూస్తే కన్నీరు ఆగదు!

Rajasthan: ప్రతి ఒక్కరు.. తమకు నచ్చిన వ్యక్తిని మనువాడి.. కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. అలానే ఓ యువతి కూడ భావించింది. ఆమె అనుకున్నట్లుగానే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ...

Rajasthan: ప్రతి ఒక్కరు.. తమకు నచ్చిన వ్యక్తిని మనువాడి.. కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. అలానే ఓ యువతి కూడ భావించింది. ఆమె అనుకున్నట్లుగానే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ...

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన జ్ఞాపకం. అందుకే ఎంతో ఘనంగా తమ వివాహం చేసుకోవాలని యువత కోరుకుంటుంది. అలానే తమకు నచ్చిన వ్యక్తిని మనువాడి.. కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. అలానే ఓ యువతి కూడ భావించింది. ఆమె అనుకున్నట్లుగానే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తోంది. ఇదే క్రమంలో ఓ ఘోరమైన ఘటన జరిగి.. ఆస్పత్రి పాలైంది. అలా గాయాలతో బెడ్ పై ఉన్న భార్యపై భర్త చూపిన  ప్రేమ అందరికి కన్నీరు తెప్పించింది. మరి.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి పట్టణంలో ప్రతాఫ్ నగర్ లో మదన్ అనే 22 ఏళ్ యువకుడు నివాసం ఉంటున్నాడు. అతడికి ఆ పక్కనే ఉన్న మరో పట్టణానికి చెందిన 21 ఏళ్ల భావన అనే యువతితో వివాహం జరిగింది. ఇక వీరి పెళ్లిన పెద్దలు ఎంతో ఘనంగా నిర్వహించారు. అత్తగారింట జరిగిన తన పెళ్లి వేడుకను తల్చుకుని మధన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఇక తన ఇంటికి బయలు దేరేందుకు సిద్ధమయ్యాడు. ఇలానే భావన కూడ తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లేందుకు.. కొత్త ప్రపంచంలో అడుగుపెడుతున్నాను అనే సంతోషంలో ఉంది.

ఇదే సమయంలో వధువరులకు తొలిరాత్రి జరిపించేందుకు ..మదన్ తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మదన్, భావన్ కారులో తమ ఇంటికి బయలు దేరారు. ఎన్నో ఊహలతో సాగుతున్న వారి కారు ప్రయాణం.. ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఇంటికి దగ్గర శోభనం ఏర్పాట్లు చేస్తున్న మదన్ తల్లిదండ్రులకు షాకింగ్ వార్త ఒకటి తెలిసింది. నూతన వధువరులు ప్రయాణిస్తున్న కారు..ప్రమాదానికి గురైంది. రోడ్డుపై పశువులు నిద్రిస్తుండగా, వాటిని గమనించిన డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మదన్, భావనలకు గాయాలయ్యాయి. వధువుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

అదే సమయంలో వరుడుకి కూడా గాయలయ్యాయి. అయినా తన దెబ్బలను సైతం లెక్కచేయకుండా.. వధువు వద్దనే కూర్చుని ఆమెకు బాగోలులు చూస్తున్నాడు. ఇలా కొన్ని గంటల పాటు వధువు వద్దనే ఉన్నాడు. అలా దెబ్బలతో ఉండి కూడా భార్య వద్దనే ఉన్న మదన్ చూసి తోటి వారు కన్నీరు పెట్టుకున్నారు. కాసేపటి తరువాత ఇరు కుటుంబాలకు చెందిన వారు ఆస్పత్రికి చేరుకున్నారు. మదన్ గాయపడినా.. ఆస్పత్రిలో అతడి భార్య పక్కనే కూర్చుని ప్రోత్సహిస్తున్న దృశ్యం అందరి హృదాయలను కదిలించింది. ప్రాణపాయం లేదని త్వరలోనే ఇద్దరి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇలాంటి భర్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments