తొలిరాత్రి మృగంలా మారిన భర్త.. ఆ మాత్రలు వేసుకుని మరీ భార్యపై!

కొత్తగా పెళ్లైయిన ఓ నవ వధువు భర్త చేసిన పనికి ఆసుపత్రి పాలయ్యింది. అతను చేసిన నిర్వాకం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఏం జరిగిందంటే..

కొత్తగా పెళ్లైయిన ఓ నవ వధువు భర్త చేసిన పనికి ఆసుపత్రి పాలయ్యింది. అతను చేసిన నిర్వాకం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవల కాలంలో మహిళల పై అనేక లైంగిక వేధింపులు, అత్యాచారలనేవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితే బయటి నుంచి ఎదుర్కొనే సమస్యలను కొంత ఎదుటవారికి ధైర్యంగా చెప్పుకోగలరు. కానీ, వివాహ బంధంలో.. తమ జీవిత భాగస్వామితో ఎదురైయ్యే సమస్యలను మాత్రం బహిరంగంగా చెప్పుకోలేరు. ఇలా ఎంతోమంది మహిళలు తమ భర్త చేతుల్లో బానిసలుగా మారి అనేక వేధింపులకు గురవుతున్నారు. ముఖ్యంగా.. శారీరకంగా కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ నరకం అనుభవిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది పురుషులు స్త్రీలను గృహనిర్భంధన చేస్తూ..ఒక మృగంలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి లైంగిక వేధింపులను భరించలేక, బయటకు చెప్పుకోలేక ఎంతోమంది స్త్రీలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ నవ వధువు కూడా తొలిరాత్రి భర్త చేతిలో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఓ నవ వధువు పెళ్లైయిన తొలి రాత్రే భర్త హింసతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరింది. కానీ, వైద్యం విఫలం కావడంతో పెళ్లయిన ఏడో రోజుకే భర్త కోరికకు బలైంది. ఈ విషాద ఘటన హామీర్ పూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫిబ్రవరి 3న ఉరైకి చెందిన ఇంజనీర్‌తో ఓ మహిళకు వివాహం జరిగింది. అయితే ఆ మహిళకు తల్లిదండ్రులు లేకపోవడంతో, ప్రభుత్వ ఉద్యోగి అయిన సోదరుడు, బంధువులు నిలబడి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. దీంతో వివాహ అనంతరం ఆ మహిళ ఫిబ్రవరి 4న తన అత్తగారి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే తొలి రాత్రిలో కామోద్దిపన మాత్రలు వేసుకున్న ఇంజనీర్ భర్త మత్తులో ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. అలా రోజులు గడిచేకొద్దీ ఆమె పరిస్థితి విషమంగా మారింది. వెంటనే.. గైనకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. దీని తర్వాత ఆ మహిళ ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాన్పూర్ కు వెళ్లగా.. అక్కడ అనారోగ్యంతో బాధపడింది. అనంతరం ఆమెను కాన్పూర్ లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కు తరలిచారు. కానీ, మహిళ పరిస్థితి విషమించడం చూసి.. కాషాయ మాత్ర వేసుకుని ఆమెతో శృంగారంలో పాల్గొన్నట్లు భర్త వైద్యులకు తెలియజేశాడు. ఇక ఆ మహిళ ప్రైవేట్ భాగాల్లో గాయాలు కారణంగా, ఇన్ఫెక్షన్ కారణంగా ఫిబ్రవరి 10వ తేదిన మృ‌తి చెందింది.

ఈ ఘటన జరిగిన తర్వాత మృతురాలి సోదరుడు ఆమె భర్త, కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటన అనంతరం మృతురాలి భర్త ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారైయ్యాడు. దీంతో నిందుతుడిని గాలించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. మరి, నవ వధువు ఇలా భర్త చేతిలో దాడికి గురయ్యి చనిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments