Taapsee Pannu: సూపర్ హిట్ సీక్వెల్ తో టాలీవుడ్ లో తాప్సి రీ ఎంట్రీ.. ఈసారి అంతకుమించి

Taapsee Pannu: సూపర్ హిట్ సీక్వెల్ తో టాలీవుడ్ లో తాప్సి రీ ఎంట్రీ.. ఈసారి అంతకుమించి

కొన్ని సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత అనుకోకుండా తెలుగు సినిమాలకు దూరమైపోతు ఉంటారు. అలాంటి వారిలో తాప్సి కూడా ఒకరు. ఈ క్రమంలో తాప్సి ఇంట్రెస్టింగ్ సిక్వెల్ తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

కొన్ని సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత అనుకోకుండా తెలుగు సినిమాలకు దూరమైపోతు ఉంటారు. అలాంటి వారిలో తాప్సి కూడా ఒకరు. ఈ క్రమంలో తాప్సి ఇంట్రెస్టింగ్ సిక్వెల్ తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

కొంతమంది నటి నటులు కేవలం కొన్ని సినిమాలతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ బ్యూటీ తాప్సి కూడా తెలుగులో తీసింది కొన్ని సినిమాలే అయినా కానీ.. ప్రేక్షకులను మెప్పించింది. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుసగా చాలా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. కొంతకాలం తర్వాత బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ కూడా వరుస ఆఫర్లు అందిపుచ్చుకుని సక్సెస్ సాధించింది. ఇక ఈ క్రమంలో కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరమైపోయిన ఈ అమ్మడు.. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఓ బ్లాక్ బస్టర్ సిక్వెల్ తో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం సిక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన సినిమాలకు అదే రేంజ్ లో సిక్వెల్స్ ను తీసుకొస్తూ.. ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో కొన్నాళ్లుగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైనా తాప్సి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సిక్వెల్ తో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. తాప్సి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ.. “ఆనందోబ్రహ్మ” సినిమాకు సిక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే తాప్సి రీఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈ బ్లాక్ బస్టర్ సిక్వెల్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో వేచి చూడాలి.

2017 లో వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమాకు.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో తాప్సి తో పాటు తాప్సీ పన్ను, రాజీవ్ కనకాల, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, రఘు కారుమంచి లాంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను బాగానే మెప్పించింది. మరి ఇప్పుడు హర్రర్ కథలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని.. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆనందో బ్రహ్మ సినిమాలు సిక్వెల్ ను తీయాయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments