రచ్చ రవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ..యాంకర్ కౌంటర్ వైరల్!

Anchor Geetha Bhagat Fires on Racha Ravi: టాలీవుడ్ మూవీ ఈవెంట్స్ లో గత కొంత కాలంగా యాంకర్లపై కొంతమంది డబుల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్న విషయం తెలిసిందే.. అలాంటి ఘటనే మళ్లీ పునరావృతం అయ్యింది.

Anchor Geetha Bhagat Fires on Racha Ravi: టాలీవుడ్ మూవీ ఈవెంట్స్ లో గత కొంత కాలంగా యాంకర్లపై కొంతమంది డబుల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్న విషయం తెలిసిందే.. అలాంటి ఘటనే మళ్లీ పునరావృతం అయ్యింది.

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో చాలా వరకు సినిమాలు రిలీజ్ కి ముందే ఏదో ఒక రకంగా ఆడియన్స్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది నటీనటులు ఇందుకోసం వినూత్న ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్లలో కనిపిస్తారో అలాంటి వేషదారణతో మూవీ ఈవెంట్స్ లో పాల్గొంటూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు.  ఇదిలా ఉంటే గత కొంత కాలంగా మూవీ ఈవెంట్స్ కొన్నిసార్లు యాంకర్లపై డబుల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్య పదజాలంతో కొంతమంది రెచ్చిపోవడం..వారికి యాంకర్లు గట్టి కౌంటర్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటన ఒకటి ఓం భీం బుష్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. విరాల్లోకి వెళితే..

గతంలో బ్రోచేవారెవరురా మూవీతో మంచి హిట్ అందుకున్న బ్యాంగ్ బ్రదర్స్ శ్రీ విష్ణు, రాహూల్ రామకృష్ణ, ప్రియదర్శి.. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘ఓం భీమ్ బుష్’ మూవీలో నటించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-లుక్, గ్లింప్స్, ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.   వి సెల్యులాయిడ్, సునీల్ బలసు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. నిన్న ఈ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహూల్ రామకృష్ణ ఆస్ట్రోనాట్స్ స్పేస్ సూట్ లో కనిపించారు. ఈ టీజర్ ఈవెంట్ కి గీతా భగత్ యాంకర్ గా వ్యవహరించారు. టీజర్ లాంచ్ సమయంలో జబర్దస్త్ రచ్చరవి మద్యలో ఎంట్రీ ఇచ్చి నానా రచ్చ చేశాడు.

స్టేజ్ పైకి వచ్చిన రచ్చ రవి యాంకర్ గీతా భగత్ తో మాట్లాడుతూ.. ‘ఓం భీమ్ బుష్.. నీది మాయం అయ్యింది’ అంటూ కామెంట్ చేశాడు.. దానికి గీతూ తో పాటు అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. కొద్ది సేపు గ్యాప్ ఇచ్చి రవి అంటే ‘నీ మనసు మాయమై నా దగ్గరికి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ జోక్ కి అక్కడ అందరూ నవ్వుకున్నా.. యాంకర్ గీతా భగత్ కి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. వెంటనే గీతా భగత్ ‘నువ్వు గ్యాప్ ఇచ్చి మాట్లాడకు.. ఓం భీమ్ బుష్ నీది మాయం అయ్యింది.. అదే నీ బుర్ర నీ నుంచి మాయం అయ్యింది’ అంటూ స్టేజ్ పైనే రచ్చ రవికి గట్ట కౌంటర్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మార్చి 22 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Show comments