Janhvi Kapoor: ఆస్పత్రిలో చేరిన జాన్వీ కపూర్! ఏమైందంటే?

జూలై 12న అనంత్ అంబానీ-రాధిక పెళ్లిలో తన ప్రియుడు శిఖర్ పహరియాతో కలిసి సందడి చేసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆస్పత్రిలో చేరింది. ఈ దేవర బ్యూటీకి ఏమైందంటే?

జూలై 12న అనంత్ అంబానీ-రాధిక పెళ్లిలో తన ప్రియుడు శిఖర్ పహరియాతో కలిసి సందడి చేసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆస్పత్రిలో చేరింది. ఈ దేవర బ్యూటీకి ఏమైందంటే?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆస్పత్రిలో చేరింది. జూలై 12న అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ పెళ్లికి హాజరైన జాన్వీ.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. జాన్వీ హాస్పిటల్ లో చేరిన విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా ధృవీకరించాడు. అసలు జాన్వీకి ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఆస్పత్రిలో చేరింది. జూలై 12న అనంత్ అంబానీ-రాధిక పెళ్లిలో తన ప్రియుడు శిఖర్ పహరియాతో కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే.  అయితే ఆ తర్వాత జాన్వీ ఫుడ్ పాయిజన్ కు గురికావడంతో.. ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం జాన్వీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సన్నిహితులు వెల్లడించారు. శుక్రవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోనీ కపూర్ సైతం ధృవీకరించారు.

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే ‘ఉలజ్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో అలరించింది. టాలీవుడ్ లో ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC 16లో, లేటెస్ట్ గా నానితో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. వరుస అవకాశాలతో టాలీవుడ్ ను దున్నేస్తోంది ఈ బాలీవుడ్ సోయగం.

Show comments