రాజ్ తరుణ్ పై ఫిర్యాదు.. అసలు ఎవరీ లావణ్య.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే!

రాజ్ తరుణ్ పై ఫిర్యాదు.. అసలు ఎవరీ లావణ్య.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విసయం తెలిసిందే. ఎందుకంటే.. రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయి ప్రేమించి మోసం చేయడమే అందుకు కారణం. అసలు ఇంతకి ఈ లావణ్య ఎవరు..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విసయం తెలిసిందే. ఎందుకంటే.. రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయి ప్రేమించి మోసం చేయడమే అందుకు కారణం. అసలు ఇంతకి ఈ లావణ్య ఎవరు..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విసయం తెలిసిందే. ఎందుకంటే.. రాజ్ తరుణ్, లావణ్య అనే అమ్మాయి ప్రేమించి మోసం చేయడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే లావణ్య అనే అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్ లో నేడు అనగా శుక్రవారం(జులై 5వతేదీ)నాడు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే లావణ్య తన ఫిర్యాదులో రాజ్ తరుణ్ తనని ప్రేమించి వదిలేశాడని, ఇక తామిద్దరం గత 11ఏళ్లగా రిలేషిన్ షిప్ లో ఉన్నమని కానీ, గుడిలో కూడా పెళ్లి చేసుకున్నామని తెలిపింది. కానీ, ఇంతలోనే మరొక హీరోయిన్ తో రాజ్ తరుణ్ కు పరిచయం కావడంతో.. ఆమె మోజులో పడిన రాజ్ తరుణ్ తనని వదిలేసి వెళ్లిపోయడాని వాపోయింది. ఇకపోతే తామిద్దరం విడిపోవడానికి ఆ సినీ నటి కారణమని లావాణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఇకపోతే గతంలో డ్రగ్స్ కేసులో కూడా ఈ లావణ్య అరెస్ట్ అయ్యి 45 రోజులు జైల్లో ఉన్నా విషయం తెలిసిందే. అసలు ఇంతకి ఎవరీ ఈ లావణ్య..?

లావణ్య..ఈమె ఒక మ్యూజిషియన్. అయితే ఈమెకు టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కు 2011లో పరిచయం ఏర్పాడింది. అనగా రాజ్ తరుణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే వీరిద్దరికి పరిచయం ఉంది. ఇకపోతే రాజ్ తరుణ్ 2013లో ఉయ్యాల జంపాల అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. అయితే సినిమాల్లోకి రాకముందు ఈ హీరో షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచే రాజ్ తరుణ్, లావణ్యల మధ్య పరిచయం ఏర్పాడి ఆ పరిచయం కాస్త ప్రేమగా చిగురించింది. ఈ క్రమంలోనే దాదాపు 11 ఏళ్లుగా వీరిద్దరూ లివింగ్ రిలిషన్ ఉన్నారని, అంతేకాకుండా రాజ్ తరుణ్ తనని గుడిలో పెళ్లి కూడా చేసుకున్నడని కూడా లావణ్య ఆరోపణలు చేసింది. కానీ, ఇంతలోనే మరో హీరోయిన్ తో పరిచయం ఏర్పాడటంతో రాజ్ తరుణ్ తనని మోసం చేసి వదిలేసి వెళ్లిపోయాడని వాపోయింది. ఇకపోతే గతంలో వరలక్ష్మీ టిఫిన్స్‌ అధినేతపై నమోదైన డ్రగ్స్‌ కేసులో కూడా లావణ్య పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

కానీ, ఆ సమయంలో తాను దొరకుండా తప్పించుకంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘ పెట్టాడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే లావణ్య ఓరోజు ఆర్టీసీ బస్సు ఎక్కే సమయంలో నార్సింగి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను తనిఖీ చేయగా.. ఆమె హ్యాండు బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి. దీంతో లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఉనిత్‌ రెడ్డి అనే వ్యక్తి గోవా నుంచి తీసుకొచ్చి డ్రగ్స్‌ ఇచ్చినట్లుగా తెలిపింది. ఇక ఉనిత్‌ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అలా డ్రగ్స్ కేసులో ఇరుక్కొని అరెస్టు అయిన లావణ్య.. దాదాపు 45 రోజుల పాటు జైలులో ఉంది. కాకపోతే ఆ డ్రగ్స్ కేసులో కూడా తనని కావలనే ఇరికించరని, ఆ సమయంలో కూడా రాజ్ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాజ్ తరుణ్ తనని ప్రేమించి మోసం చేశాడంటూ.. ఆరోపణలు చేయడమే కాకుండా.. అతని పై కేసు పెట్టడంతో మరోసారి లావణ్య పేరు తెరపై జోరుగా విపిస్తుంది.

 

Show comments