Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్! బుల్లి తెరపైకి వచ్చేస్తోన్న భోళా శంకర్!

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయినా కూడా ఇంకా బుల్లి తెరపై ప్రదర్శింపబడలేదు. తాజాగా ఈ సినిమా బుల్లి తెరపై రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయినా కూడా ఇంకా బుల్లి తెరపై ప్రదర్శింపబడలేదు. తాజాగా ఈ సినిమా బుల్లి తెరపై రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ టైం భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. ఎన్నో భారీ అంచనాలతో ఈ సినిమా గత ఏడాది ఆగష్టు 11వ తేదీన విడుదల అయ్యింది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు భావించారు. పైగా ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వేదాళం’ కి రీమేక్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. కానీ విడుదలయ్యాక ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరక్కింది ఈ సినిమా. దాదాపు 79 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. కానీ లాంగ్ రన్ లో ఈ సినిమా కేవలం 43 కోట్ల దాకా మాత్రమే వసూళ్లు రాబట్టగలిగింది. 

 

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయినా కూడా ఇంకా బుల్లి తెరపై ప్రదర్శింపబడలేదు. ఇక తాజాగా ఈ సినిమా బుల్లి తెరపై రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. జీ తెలుగులో సెప్టెంబర్ 15న ఆదివారం నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సినిమా ప్రదర్శించబడనుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది. యంగ్ హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడు మారుతి స్వర సాగర్ సంగీతం అందించాడు.. మరి వెండి తెరపై ఆకట్టుకోలేని ఈ సినిమా బుల్లి తెరపై ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మరి భోళా శంకర్ టెలివిజన్ ప్రీమియర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.  

 

Show comments