Thanthadi Beach: దారుణం! సముద్రం చూసేందుకు వెళ్లి.. సెల్ఫీ దిగుతూ..!

Atchutapuram, Thanthadi Beach, Vizag: అచ్యుతాపురంలోని తంతడి బీచ్‌లో దారుణం చోటు చేసుకుంది. సముద్రం చూసేందుకు వెళ్లిన యువతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Atchutapuram, Thanthadi Beach, Vizag: అచ్యుతాపురంలోని తంతడి బీచ్‌లో దారుణం చోటు చేసుకుంది. సముద్రం చూసేందుకు వెళ్లిన యువతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

సముద్రం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి.. బీచ్‌లో సరదాగా గడపాలని, ఆ అలల హోరును ఆస్వాదించాలని ప్రతి ఒక్కరు కోరకుంటున్నారు. కానీ, అదే సమయంలో సముద్రం వద్దకు వెళ్లిన సమయంలో కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి. లేకుండా సముద్రం చూసే సంతోషంలో తీరని శోకం మిగులుతుంది. తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రం చూసేందుకు వెళ్లిన ముగ్గురు యువతలు అందులో పడి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన ఇద్దరు యువతులు అక్కాచెల్లెళ్లుగా తెలుస్తోంది. అసలు ఈ ఘటన ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మాకవరపాలెం మండలం శెట్టిపాలెంకి చెందిన నూకరత్నం, తీడ గ్రామానికి చెందిన కనక దుర్గతో పాటు శిరీష అనే యువతి.. బీచ్‌లో సరదాగా గడిపేందుకు అచ్చుతాపుర మండలంలోని తంతడి బీచ్‌కు వచ్చారు. చాలా సేపు ఎంతో సంతోషంగా గడిపారు. కానీ, ఇంతలో ప్రమాదం ముంచుకువచ్చింది. బీచ్‌లో గడిపిన ఈ ఆనంద సమయాన్ని తమ ఫోన్లలో బంధించుకుందామని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అలా సెల్ఫీలు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ నీటిలో పడిపోయారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న మత్స్యకారులు కాపాడడానికి ప్రయత్నాచిన అప్పటికే ఇద్దరు యువతులు మృతి చెందారు. మృతిచెందిన ఇద్దరి యువతులు అక్కా చెల్లెలుగా గుర్తించారు అధికారులు. శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూక రత్నం, కనకదుర్గ మృతి చెందగా శిరీష పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను విశాఖపట్నంలోని కేజీహెచ్‌కి తరలించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Show comments