idream media
idream media
సీఎం కేసీఆర్ కాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ పేరును, విధివిధానలను జనం ముందుంచనున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలనేతలు హైదరాబాద్ కు వచ్చారు. కేసీఆర్కు మద్దతునిచ్చారు. జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే అధినేత తిరుమాళవన్, మరికొంమంది ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల హడావిడి మొదలైంది.
కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు.