Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ విజేతగా నిలవాలంటే ఆ ఇద్దరు ప్లేయర్లను బరిలోకి దింపాల్సిందేనని సురేష్ రైనా అన్నాడు. వాళ్లిద్దరూ ఆడితే కప్పు మనదేనని చెప్పాడు.
టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ విజేతగా నిలవాలంటే ఆ ఇద్దరు ప్లేయర్లను బరిలోకి దింపాల్సిందేనని సురేష్ రైనా అన్నాడు. వాళ్లిద్దరూ ఆడితే కప్పు మనదేనని చెప్పాడు.
Nidhan
ఈ ఏడాది క్రికెట్లో బిగ్ టోర్నమెంట్ జరగనుంది. అదే టీ20 వరల్డ్ కప్. జూన్లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం టీమ్స్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేశాయి. టీమిండియా కూడా పొట్టి ఫార్మాట్లో జరిగే ప్రపంచ కప్ను ఎగరేసుకుపోవాలని అనుకుంటోంది. అయితే మిగిలిన దేశాల కంటే భారత్కు సన్నాహకాలకు ఎక్కువ టైమ్ లేదు. ఆఫ్ఘానిస్థాన్తో స్టార్ట్ అయ్యే మూడు టీ20ల సిరీసే ఈ ఫార్మాట్లో ఆఖరి సిరీస్ కానుంది. ఆ తర్వాత ఐపీఎల్ షురూ కానుంది. టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి ఇదే ఆఖరి ఛాన్స్. ఈ తరుణంలో బ్రహ్మ్రాస్త్రాలను బయటకు తీసింది బీసీసీఐ. ఆడతారో లేదోననే డౌట్ ఉన్న ఇద్దరు ఛాంపియన్ ప్లేయర్లను బరిలోకి దింపుతోంది. వాళ్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తారనుకుంటున్న వేళ పొట్టి ఫార్మాట్లో ఆడేందుకు వీళ్లను ఒప్పించింది. ఆఫ్ఘాన్తో సిరీస్కు వీళ్లను సెలక్ట్ చేసింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్, కోహ్లీ ఉంటే వరల్డ్ కప్ మనదేనన్నాడు.
టీ20ల్లోకి కోహ్లీ, రోహిత్ కమ్బ్యాక్ ఇచ్చేలా చేసిన బీసీసీఐని రైనా మెచ్చుకున్నాడు. టీ20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న యూఎస్ఏ, కరీబియన్ దీవుల్లో పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయని.. అక్కడ వీళ్లిద్దరి అనుభవం టీమ్కు ఎంతో పనికొస్తుందన్నాడు. ‘వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్న యూఎస్ఏ, వెస్టిండీస్లో వికెట్లు కాస్త ట్రికీగా ఉంటాయి. అక్కడ రోహిత్, కోహ్లీల ఎక్స్పీరియెన్స్ జట్టుకు ఎంతో అవసరం. విరాట్ టీ20 క్రికెట్లో 12 వేల పరుగుల మార్క్కు దగ్గర్లో ఉన్నాడు. కాబట్టి వీళ్లిద్దరూ ఉంటే టీమిండియా బలం రెట్టింపు అవుతుంది. కోహ్లీ మూడో నంబర్లోనే బ్యాటింగ్ చేయాలి. సవాల్ విసిరే పిచ్ల మీద అతడు నిలబడి పట్టుదలతో బ్యాటింగ్ చేయగలడు. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, శుబ్మన్ గిల్ లాంటి ఫియర్లెస్ క్రికెటర్లు టీమ్లో ఉన్నారు. కానీ రోహిత్, కోహ్లీని ఆడించాల్సిందే’ అని రైనా స్పష్టం చేశాడు.
జైస్వాల్, రింకూ సింగ్, శుబ్మన్ గిల్ లాంటి వాళ్లు ఎందరు టీమ్లో ఉన్నా సరిపోరని.. కోహ్లీ, రోహిత్ ఉంటే జట్టు దృఢంగా మారుతుందన్నాడు రైనా. వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్స్లో ఎంతో ఒత్తిడి ఉంటున్నాడు. మెగాటోర్నీలో టార్గెట్ ఛేజ్ చేసే సమయంలో కోహ్లీ, రోహిత్ టీమ్లో ఉంటే గెలుస్తామనే భరోసా కలుగుతుందన్నాడు. ఈ ఇద్దరు ప్లేయర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ టీ20 వరల్డ్ కప్లో ఆడించాలని రైనా పేర్కొన్నాడు. కాగా, ఐసీసీ ఇటీవలే టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ను ప్రకటించింది. మెగా టోర్నీ జూన్ 1వ తేదీన మొదలవుతుంది. ఫైనల్ మ్యాచ్ బార్బడోస్లో జరుగుతుంది. టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో, 9న పాకిస్థాన్తో, 12న అమెరికాతో, 15న కెనెడాతో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మరి.. రోహిత్, కోహ్లీ ఆడితే వరల్డ్ కప్ మనదేనంటూ రైనా చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: అతనే నెం.1 ఇండియన్ క్రికెటర్! ఇంగ్లండ్ ప్లేయర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Suresh Raina believes that the inclusion of Rohit Sharma and Virat Kohli will provide much-needed solidity to the India squad.#T20WorldCup2024 #SureshRaina #RohitSharma #ViratKohli #CricketTwitter pic.twitter.com/QHbXxqnPtR
— InsideSport (@InsideSportIND) January 11, 2024