iDreamPost

‘తెలుగు మహిళ’కు నూతన అధ్యక్షురాలు

‘తెలుగు మహిళ’కు నూతన అధ్యక్షురాలు

తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనితను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు వెల్లడించారు.

అనిత 2014లో టీడీపీ తరఫున విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి.. అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి ఆశించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పీతల సుజాత టీడీపీ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రివర్గం విస్తరణలో భాగంగా పీతల సుజాత స్థానం తనకు ఇస్తారని అనిత ఆశించారు. కానీ అనిత ఆశలు నెరవేరలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి