iDreamPost

అచ్చం తండ్రిని గుర్తు చేస్తున్నాడు! వైరల్ అవుతున్న తారకరత్న తనయుడి ఫోటో!

  • Author ajaykrishna Published - 02:46 PM, Fri - 14 July 23
  • Author ajaykrishna Published - 02:46 PM, Fri - 14 July 23
అచ్చం తండ్రిని గుర్తు చేస్తున్నాడు! వైరల్ అవుతున్న తారకరత్న తనయుడి ఫోటో!

చిత్రపరిశ్రమలో నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ నటుడుగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు అయిన తారకరత్న.. పాలిటిక్స్ పట్ల ఇంటరెస్ట్ తో లోకేష్ పాదయాత్రకు వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే. సడన్ గా గుండెపోటు రావడం.. అక్కడినుండి హాస్పిటల్ లో చేరిక.. సుమారు 23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న కన్నుమూశారు. చిన్న వయసులోనే మరణించేసరికి నందమూరి ఫ్యామిలీ, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే మెల్లగా అందరూ ఆ విషాదం నుండి బయట పడుతున్నప్పటికి.. తారకరత్న భార్య, పిల్లలైతే నిత్యం ఆయన జ్ఞాపకాల్లోనే బ్రతికేస్తున్నారు.

తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి.. ఇద్దరు కూతుర్లు నిష్క, రేయ.. కుమారుడు తనయ్ రామ్ ఉన్నారు. తారకరత్న చనిపోయాక.. సోషల్ మీడియాలో ప్రతీ పోస్ట్ ఆయనను గుర్తు చేసుకుంటూ.. ఆయన గురించి ఊసు లేకుండా అలేఖ్య రెడ్డి పోస్టులు పెట్టడం లేదు. ప్రతీ పోస్ట్ లో భర్తను తలచుకొని ఎంతో ఎమోషనల్ అయిపోతుంది అలేఖ్య రెడ్డి. మొన్నటివరకు కూతురు నిష్క ఫోటోలు, భర్తతో దిగిన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసిన అలేఖ్య రెడ్డి.. రీసెంట్ గా తనయుడు తనయ్ రామ్ ఫోటో షేర్ చేసి సర్ప్రైజ్ చేసింది. సర్ప్రైజ్ ఎందుకంటే.. తారకరత్న చిన్నప్పుడు ఎలా ఉండేవాడో.. అచ్చం తండ్రిలాగే కొడుకు తనయ్ రామ్ ఉండటంతో.. ఆయనలాగే అంటూ అలేఖ్య రెడ్డి ఇద్దరి పిక్స్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి తారకరత్న తనయుడి పిక్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి