iDreamPost

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా-శ్రీముఖి!

  • Author singhj Published - 07:44 PM, Thu - 13 July 23
  • Author singhj Published - 07:44 PM, Thu - 13 July 23
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా-శ్రీముఖి!

యాంకర్లకు ప్రేక్షకుల్లో ఉండే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. టీవీ షోల నుంచి సినిమా ఈవెంట్ల వరకు ఏ ప్రోగ్రామ్​లో అయినా యాంకర్లు ఉండాల్సిందే. వారికి మంచి రెమ్యూనరేషన్​తో పాటు పాపులారిటీ కూడా దక్కుతుంది. రష్మీ, అనసూయ లాంటి యాంకర్లు అయితే తమ యాక్టింగ్​ టాలెంట్​తో మూవీ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. అందుకే చాలా మంది యాంకర్లుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలో దూసుకొచ్చిన టాలెంటెడ్ యాంకరే శ్రీముఖి. ఎప్పడూ చలాకీగా ఉంటూ, తన మాటలతో పాటు అందంతోనూ ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టారు శ్రీముఖి.

ప్రస్తుతం తెలుగులో అటు టెలివిజన్​తో పాటు ఇటు సినిమాల్లోనూ పనిచేస్తున్న బెస్ట్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. యాంకరింగ్​తో నిత్యం బిజీగా ఉండే ఈ అందాల భామ.. టైమ్ దొరికినప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్​తో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఫొటో షూట్లలో దిగిన హాట్ ఫొటోలను కూడా నెట్టింట షేర్ చేసుకుంటారు. అలాంటి శ్రీముఖి ఇవాళ దైవ దర్శనానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని ఆమె దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ టూరిజం శాఖ మంత్రి రోజాతో కలసి తిరుమల సందర్శించారు శ్రీముఖి.

ఎప్పుడూ షూటింగ్స్​తో బిజీగా ఉండే శ్రీముఖి కాస్త గ్యాప్ దొరకడంతో తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం మంత్రి రోజా, శ్రీముఖి కలసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ టూర్​కు సంబంధించిన ఫొటోలను తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో షేర్ చేశారు శ్రీముఖి. కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు తమ్ముడు, అమ్మానాన్నలతో కలసి తిరుమలకు వచ్చారు శ్రీముఖి. వాళ్లతో కలసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారామె. ఈ స్టార్ యాంకర్ తిరుమల టూర్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి