iDreamPost

అమరావతి లోకి వెళుతుంటే ఎడారిలోకి వెళుతున్నట్లుంటుంది

అమరావతి లోకి వెళుతుంటే ఎడారిలోకి వెళుతున్నట్లుంటుంది

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం తన అభిప్రాయాని వ్యక్తం చేశారు. అసెంబ్లీ, సచివాలయాలకు వెళుతుంటే ఎక్కడో రాజస్థాన్‌ ఏడారిలోకి వెళుతున్నట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాజధానిలోకి వెళుతుంట్లే ఏడారిలోకి వెళుతున్న భావన తనలో కలుగుతోందన్నారు.

రాజధాని అంటే అందరిదీ అన్న భావన ఉండాలని స్పీకర్‌ తమ్మినేని అన్నారు. కానీ అమరావతితో ప్రజల్లో అలాంటి భావన రాలేదన్నారు. తనకు అమరావతి ప్రజల రాజధాని అన్న భావన కలగలేదని చెప్పారు. మూడు రాజధానులను ప్రతిపాదించిన నిఫుణుల కమిటీ నివేదికపై విమర్శలు చేస్తున్న వారు వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు. అమరావతిలో జరిగిన ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై విచారణ జరగాన్నారు. బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకువాలని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి