iDreamPost

OTT పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ‘స్కంద’! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Author Soma Sekhar Updated - 11:33 PM, Thu - 2 November 23
  • Author Soma Sekhar Updated - 11:33 PM, Thu - 2 November 23
OTT పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ‘స్కంద’! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘స్కంద’ తాజాగా(సెప్టెంబర్ 28)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. యాక్షన్ ప్రియుల్ని అలరిస్తూ.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల నటించగా.. తమన్ మరోసారి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. ఇక ఈ మూవీలో బోయపాటి మార్క్ యాక్షన్ కి కొదవలేదు. ఇదిలా ఉండగా.. స్కంద తన ఓటీటీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే స్కంద స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

‘స్కంద’.. రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఊర మాస్ మూవీ. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్ల దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రామ్ ఊర మాస్ యాక్షన్ కు తోడు.. బోయపాటి మేకింగ్ తోడవ్వడంతో.. స్కంద యాక్షన్ ప్రియుల్ని అలరిస్తోంది. ఇదిలా ఉండగా స్కంద తన ఓటీటీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్కంద ఓటీటీ హక్కులు దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది స్కంద. అంటే అక్టోబర్ చివరి వారంలో రామ్ ఓటీటీలో సందడి చేస్తాడన్నమాట. కాగా.. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి