iDreamPost

మీర్జాపూర్ సిరీస్ పై సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ కామెంట్స్!

సందీప్ రెడ్డి- రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్ కొట్టింది. కథ, కథనమే కాదూ మ్యూజిక్, బీజీఎం సినిమాను ఎడ్జ్ లో కూర్చొబెట్టాయి. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. అయితే బాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీపై విషం కక్కడం స్టార్ చేశారు.

సందీప్ రెడ్డి- రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్ కొట్టింది. కథ, కథనమే కాదూ మ్యూజిక్, బీజీఎం సినిమాను ఎడ్జ్ లో కూర్చొబెట్టాయి. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. అయితే బాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీపై విషం కక్కడం స్టార్ చేశారు.

మీర్జాపూర్ సిరీస్ పై సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ కామెంట్స్!

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా- రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన మూవీ యానిమల్.  బాక్సాఫీసును షేక్ చేసేసింది ఈ చిత్రం. గత ఏడాది డిసెంబర్ 1న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీడియోల్, త్రిప్తి దిమ్రి, బబ్లూ పృధ్వీరాజ్ ప్రధాన పాత్రలను పోషించారు. థియేటర్లలో సందడి చేసిన యానిమల్.. జనవరి 26న ఓటీటీలోకి వచ్చి అక్కడ కూడా హయ్యెస్ట్ వ్యూస్‌ను రాబట్టుకుంది. కానీ ఓటీటీలోకి వచ్చాక.. ఈ మూవీని టార్గెట్ చేస్తున్నారు కొంత మంది. అయితే అస్సలు తగ్గేదేలే అంటూ ఇచ్చిపడేస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

రాధిక శరత్ కుమార్ ఈ మూవీ పేరు ప్రస్తావించకుండా ‘ ఈ సినిమా చూస్తుంటే వాంతి చేసుకోవాలనిపించింది’అంటూ మాట్లాడింది. అలాగే కస్తూరి శంకర్ కూడా నెగిటివ్ కామెంట్స్ చేసింది. ఇక బాలీవుడ్ మీడియా అయితే.. విపరీతంగా నోరు పారేసుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లిన తాప్పీ పన్ను కూడా ఈ మూవీపై, హీరోయిన్ రష్మికపై నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఇక అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ‘ ఈ మూవీలోని సన్నివేశాలు అగౌర పరిచేలా ఉన్నాయని’ కామెంట్స్ చేస్తే దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. తాజాగా మరో ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇదే రకమైన కామెంట్స్ చేస్తే.. వారికి కూడా గట్టిగా ఇచ్చేశాడు డేరింగ్ డైరెక్టర్.

బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఈ చిత్రాన్ని పరోక్షంగా విమర్శించారు. ఇలాంటి చిత్రాలు వెరీ డేంజరస్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సందీప్ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ‘మీర్జాపూర్ సిరీస్ నిండా విపరీతమైన బూతు పదాలున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఈ సిరీస్ నిర్మాత పర్హాన్ అక్తర్‌కు చెబితే బాగుంటుంది. తన కుమారుడి పనిని జావేద్ ఎందుకు చెక్ చేయడం లేదు. దునియాలో ఉన్న బూతులన్నీ మీర్జాపూర్‌లో ఉన్నాయి. నేను పూర్తిగా కూడా ఆ సిరీస్ చూడలేకపోయా. యూట్యూబ్ లో వస్తాయి కదా రెండు నిమిషాలవి 15 సీన్లు చేశా. తెలుగులో డబ్బింగ్ అయిన ఆ పదాలు వింటే వాంతి చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. వీళ్లు నాకు చెబుతున్నారు చూడు. ఇదంతా నాటకం’ అంటూ ఇండియా గ్లిట్జ్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ హాట్ కామెంట్స్ చేశారు.

‘యానిమల్ సినిమా పేరును తన కామెంట్స్ లో జావేద్ అక్తర్ ప్రస్తావించలేదు. సినిమా చూడకుండా కామెంట్ చేసే వాళ్ల గురించి ఏం మాట్లాడతాం. ఆయన గురించే కాదూ ఎవరైనా సరే. ఒకరిపై రాయి విసిరే ముందు.. చుట్టు పక్కల ఎందుకు చెక్ చేసుకోరు’ అంటూ సందీప్ ప్రశ్నించారు. కాగా, కంగనా రనౌత్ చేసిన నెగిటివ్ కామెంట్స్ పై కూడా స్పందించారు డైరెక్టర్. నిజం చెప్పాలంటే.. కంగనా నటన తనకెంతో ఇష్టమని, ఆమెకు స్టోరీ చెబుతానని పాజిటివ్‌గా స్పందించారు. . దీనిపై కౌంటర్ ఇచ్చింది కంగనా. ‘రివ్యూలు, విమర్శలు ఒకటి కాదూ. ప్రతి కళపై సమీక్ష, చర్చ అనేది జరుగుతూనే ఉంటుంది. మీరు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అది మీకు నాపై ఉన్న గౌరవం. కానీ మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. ఒక వేళ ఇస్తే మీ అల్ఫా హీరోలు ఫెమినిస్ట్ లు అవుతారు. అదీ మీకే డేంజర్. సినీ ఇండస్ట్రీకి మీరు కావాలి’ అంటూ సమాధానం ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి