iDreamPost

MS Dhoni: ధోని కాళ్లు కొరికిన భార్య సాక్షి.. ఎందుకిలా చేసిందంటే!

  • Author singhj Published - 07:15 PM, Wed - 5 July 23
  • Author singhj Published - 07:15 PM, Wed - 5 July 23
MS Dhoni: ధోని కాళ్లు కొరికిన భార్య సాక్షి.. ఎందుకిలా చేసిందంటే!

క్రికెట్​ ఆడేవాళ్లు ఎంతోమంది ఉంటారు. జెంటిల్మన్ గేమ్ వల్ల స్టార్ స్టేటస్ సాధించిన క్రికెటర్లను చాలా మందినే చూసుంటారు. కానీ కొందరు మాత్రమే ఈ ఆటకు వన్నె తీసుకొస్తారు. ఇంకొందరు మాత్రమే తమ వల్ల గేమ్​కు క్రేజ్ తీసుకొస్తారు. అలాంటి అతికొద్ది మంది ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. క్రికెట్​ వల్లే స్టార్​గా మారిన ధోని.. ఆ తర్వాత తన గేమ్, కెప్టెన్సీ స్కిల్స్​తో ఆటకు పాపులారిటీని పెంచాడు. క్రికెట్ గురించి తెలియని వారికి కూడా ఈ టీమిండియా మాజీ కెప్టెన్ గురించి తెలిసి ఉంటుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా ఈ ఆటపై అతడు ప్రభావం చూపించాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​ బై చెప్పినప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచుతున్నాడు ధోని. పొట్టి లీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్​కు సారథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్​-2023 కప్​ను సీఎస్​కే గెలవడంలో కెప్టెన్​గా, ఆటగాడిగా ధోని పాత్ర ఎంతో ఉంది. యంగ్ ప్లేయర్లు, సీనియర్ క్రికెటర్లతో నిండిన చెన్నైని అద్భుతంగా ముందుకు నడిపించాడు ధోని. ఇంజ్యురీ అయినా కూడా పట్టువిడవకుండా చెన్నైకి ఐపీఎల్​ టైటిల్​ అందించాడు ధోని. అయితే అతడు తర్వాతి సీజన్​లో ఆడటం అనుమానంగా మారింది. మోకాలి సర్జరీ నుంచి కోలుకొని వస్తేనే వచ్చే సీజన్​లో ఆడగలడు.

ఇక, ధోని భార్య సాక్షి సింగ్ గురించి కూడా వినే ఉంటారు. ప్రొఫెషనల్​ లైఫ్​తో పాటు పర్సనల్ లైఫ్​లోనూ తాను ఇంత సక్సెస్ అవడానికి ఆమెనే కారణమని ధోని అంటుంటాడు. అలాంటి సాక్షి తన భర్త కాలును కొరకడం హాట్ టాపిక్​గా మారింది. ధోని తనను పట్టించుకోకుండా బెడ్​రూమ్​లో వీడియో గేమ్స్ ఆడటం సాక్షికి నచ్చలేదు. దీంతో ఆమె అతడి కాలును కొరికేందుకు ప్రయత్నించింది. ఈ ఫొటోను ధోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోను చూసి ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది వైఫ్ వర్సెస్ వీడియో గేమ్స్​లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇది తాజా పోస్ట్ కాదు, పాతది కావడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh (@sakshisingh_r)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి