iDreamPost

బుల్లితెరపై RRR హీరోల సందడి

బుల్లితెరపై RRR హీరోల సందడి

నిన్న భారీ అంచనాల మధ్య జెమినీలో ఎవరు మీలో కోటీశ్వరుడు షో మొదలైపోయింది. మొదటి అతిధిగా రామ్ చరణ్ రావడంతో వ్యూయర్ షిప్ ఎక్కువ వస్తుందనే విశ్లేషణతో ఫస్ట్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా పూర్తి చేశారు. ఆర్ఆర్ఆర్ విడుదల కన్నా ముందు మొదటి సారి ఈ ఇద్దరు కలిసి ఎక్కువ స్పేస్ స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భం ఇదే కావడంతో హీరోల అభిమానులు క్విజ్ పట్ల ఆసక్తి ఉన్నా లేకపోయినా కేవలం వీళ్ళ బాండింగ్ ను చూసేందుకు టీవీ సెట్లను ఆన్ చేసుకున్న మాట వాస్తవం. వాళ్ళ కోరికకు తగ్గట్టే చరణ్ తారక్ ల మధ్య బ్రోమాన్స్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పాలి. సోషల్ మీడియాలో అప్పుడే దీని తాలూకు సంగతులు హల్చల్ చేస్తున్నాయి.

కొన్ని హై లైట్స్ చూసుకుంటే చిరంజీవి ఆచార్య గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మెగాస్టార్ చిన్నప్పటి నుంచి చరణ్ కే కాదు తమలాంటి ఎందరికో ఆచార్య అని సంబోధించడం బాగా క్లిక్ అయ్యింది. సేవా కార్యక్రమాలు విస్తృత పరచడం కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని ఇవ్వబోతున్నట్టు చరణ్ ప్రకటించడం కూడా ఆకట్టుకుంది. ఆర్ఆర్ఆర్ ని మూడేళ్లుగా రాజమౌళి చెక్కుతూనే ఉన్న వైనాన్ని ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ఆరంజ్ సినిమాలో పాటను జాయింట్ గా పాడటం మరో ఆకర్షణ. మొత్తానికి మంచి సందడిగా ముగించారు. ఈ రోజు కూడా కొనసాగింపు ఉండబోతోంది.

ఈ రెండు రోజులు ఓకే కానీ అసలు పరీక్ష మాత్రం రెగ్యులర్ కంటెస్టెంట్స్ వచ్చే మంగళవారం నుంచి ఉంటుంది. ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ క్విజ్ షోకు హిందీలో తప్ప మిగిలిన భాషల్లో ఆ స్థాయి స్పందన లేదు. అందుకే కంటిన్యూ చేయలేకపోయారు. బాలీవుడ్ లో మాత్రం అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ తన గ్రేస్ తో దాన్ని నిలబెడుతూ వచ్చారు. అక్కడ ప్రైజ్ మనీ కూడా భారీగా పెంచారు కానీ ఇక్కడ కోటికే పరిమితం చేయడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ ఇంకో ఆరేడు నెలలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్న తరుణంలో చరణ్ తారక్ ల కాంబినేషన్ ఎంజాయ్ చేయడానికి ఇప్పుడీ షోలో వచ్చిన తొలి ఎపిసోడ్లు తప్ప వేరే ఆప్షన్ లేదు

Also Read : థియేటర్లు తెరిచిన ఆనందం తక్కువే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి