iDreamPost

రాఖీ భాయ్ కొత్త సినిమా ఎవరితో

రాఖీ భాయ్ కొత్త సినిమా ఎవరితో

2018 వరకు కర్ణాటక తప్ప ఇంకే రాష్ట్రంలోనూ అంతగా గుర్తింపుకు నోచుకోని హీరో యష్ జాతకం ఒక్కసారిగా కెజిఎఫ్ దెబ్బతో పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. కన్నడ డబ్బింగులకు అంతగా ఆదరణ ఉండని నార్త్ లోనూ రికార్డుల దుమ్ము దులిపాడు రాఖీ భాయ్. ఫస్ట్ పార్ట్ అనువాద హక్కులను చాలా తక్కువ మొత్తానికి కొనుక్కున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రూపాయికి అయిదు రూపాయలు లాభం పొందిన మాట వాస్తవం. తెలుగులోనూ అదే రోజు తమ సినిమాలతో వచ్చిన ఇద్దరు క్రేజీ హీరోల పోటీని తట్టుకుని కెజిఎఫ్ విన్నర్ గా నిలవడం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. వచ్చే ఏడాది చాప్టర్ 2 రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇదంతా బాగానే ఉంది కానీ యష్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడన్న క్లారిటీ మాత్రం ఎంతకీ రావడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తను తెలుగు దర్శకులతోనే వర్క్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడట. మన వాళ్లైతే మాస్ పల్స్ ని కరెక్ట్ గా పసిగట్టి ఎలివేషన్స్ బాగా ఇస్తారని అలా అయితేనే పాన్ ఇండియా మార్కెట్ ని కొనసాగించుకోవచ్చనే ఆలోచనలో ఆప్షన్లు చూస్తున్నట్టు తెలిసింది. ముందు పూరి జగన్నాధ్ కాంబినేషన్ అన్నారు కానీ కొద్దిరోజుల హడావిడి తర్వాత అదీ చల్లబడిపోయింది. లైగర్ లో బిజీగా ఉన్న పూరి తన తర్వాతి సినిమా ఎవరితోనో క్లారిటీగా చెప్పడం లేదు.

ఇప్పుడు ఫ్రెష్ గా బోయపాటి శీను పేరు తెరమీదకు వచ్చింది. అఖండ పూర్తి చేసే పనిలో ఉన్న బోయపాటి దగ్గర ఆల్రెడీ ఒక కథ ఉందట. వినయ విధేయ రామ కంటే ముందు రాసుకున్న ఆ స్క్రిప్ట్ ఎప్పటికైనా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో దాన్ని రిజిస్టర్ కూడా చేసి పెట్టారట. యాష్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది కాబట్టి తనకే వినిపించాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్టు తెలిసింది. నిజానికి కెజిఎఫ్ తర్వాత విపరీతమైన ఆఫర్లు వచ్చినప్పటికీ ఏది ఎంచుకోవాలో అర్థం కాక యష్ ఇప్పటిదాకా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్నాడు. ఇకనైనా సైలెన్స్ ని బ్రేక్ చేసి ఎవరికి ఫిక్స్ అవుతాడో చూడాలి

Also Read : థియేటర్లో అరెస్ట్ అంటున్న పిడుగులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి