iDreamPost

200 కోట్లు కొల్లగొట్టిన ‘రంగస్థలం’

200 కోట్లు కొల్లగొట్టిన  ‘రంగస్థలం’

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజా చిత్రం  ‘రంగస్థలం’. ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి ఎన్నో సంచనాలను,  సరికొత్త రికార్డు సృష్టిస్తోంది.  తాజాగా  ఈ చిత్రం రూ. 200 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అధికారికంగా  ప్రకటించింది. మార్చి 30న ఈ చిత్రం విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా రాబట్టి టాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా(నాన్‌-బాహుబలి) నిలిచింది. ‘రంగస్థలం’ లో  చిట్టిబాబుగా రామ్‌ చరణ్  నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆది పినిశెట్టి, సమంత, ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషించారు. పొలిటికల్‌ విలేజ్‌ డ్రామాను దర్శకుడు సుకుమార్‌ మలిచిన తీరు.. దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం, చంద్ర బోస్  సాహిత్యం, రత్నవేలు కెమెరా ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి