iDreamPost

ప్రిన్సిపాల్ గలీజ్ పనులు.. 9వ తరగతి విద్యార్థినితో..!

ప్రిన్సిపాల్ గలీజ్ పనులు.. 9వ తరగతి విద్యార్థినితో..!

పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఓ గురువు దారి తప్పాడు. చదువు పేరుతో 9వ తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్కూల్ కు వస్తున్న ఆ బాలికతో పాడు పనులకు తెర లేపాడు. ఇలా రోజూ ఆ విద్యార్థినిని వేధిస్తూ దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఇతగాడి వేధింపులను తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థిని ఇటీవల తల్లిదండ్రులకు వివరించింది. కోపంతో ఊగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని మైలార్ దేవులపల్లి శ్రీరామ్ నగర్ లో శంకర్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే స్కూల్ లో ఓ విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. అయితే ఈ బాలికపై ప్రిన్సిపాల్ శంకర్ ఎప్పటి నుంచో కన్నేశాడు. రోజూ ఆ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడట. కాగా, మొదట్లో ఈ విద్యార్థిని సైలెంట్ గా ఉండిపోయింది. కానీ, ప్రిన్సిపాల్ శంకర్ రోజు రోజుకు మరింత రెచ్చిపోయి ప్రవర్తించేవాడు. ఇతగాడి పాడు పనులకు తట్టుకోలేకపోయిన ఆ బాలిక.. ఇదే విషయాన్ని ఇటీవల తల్లిదండ్రులకు తెలియజేసింది.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలిక కుటుంబ సభ్యులు మైలార్ దేవ్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు ప్రిన్సిపాల్ శంకర్ ను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. 9వ తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ శంకర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: భర్త ఉండగా పరాయి వాడితో ప్రేమాయణం! అడ్డుగా ఉన్నాడని..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి